Shikhar Dhawan On Re entry: టీమ్లో చోటు కోల్పోవడంపై శిఖర్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shikhar Dhawan On Re entry: టీమ్ ఇండియాలో చోటు కోల్పోవడంపై సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Shikhar Dhawan On Re entry: గతంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్లో ఒకరిగా కొనసాగాడు శిఖర్ ధావన్. అద్భుతమైన ఆటతీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు.
ఫామ్ కోల్పోవడంతో యంగ్ ప్లేయర్స్ నుంచి పోటీ కారణంగా చాలా కాలం క్రితమే టెస్ట్ జట్టుతో పాటు టీ20లకు దూరమయ్యాడు. టీమ్ ఇండియా తరఫున అతడు టెస్ట్ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయింది. చివరగా 2018లో టెస్ట్ ఆడాడు. చివరి టీ20 మ్యాచ్ను 2021లో ఆడాడు. వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్ ప్లేయర్స్ దూరమైన సమయంలో శిఖర్ ధావన్ను జట్టులోకి తీసుకుంటోంది టీమ్ మేనేజ్మెంట్. చిన్న దేశాలపై సిరీస్ల కోసం అతడిని ఆడిస్తోంది.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్కు శిఖర్ ధావన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన రీఎంట్రీపై శిఖర్ ధావన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జట్టులోకి తాను రీఎంట్రీ ఇచ్చేందుకు దారులు ఇంకా తెరిచే ఉన్నాయని శిఖర్ ధావన్ అన్నాడు. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం.
కాలంతో పాటు అనుభవం అన్నింటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. జట్టుకు దూరమైన కాలంలో మానసికంగా నేను మరింత ధృడంగా మారాను. దూరమవ్వడాన్ని నెగెటివ్గా తీసుకోవడం లేదు. నాకంటే బాగా ఆడుతున్నారు కాబట్టే కొందరు టీమ్లో ఉన్నారు. నేను జట్టు నుంచి దూరమయ్యాను.
రీఎంట్రీ ఇవ్వడానికి దారులు మూసుకుపోలేదు. ఇప్పటికీ అవకాశం ఉంది. తప్పకుండా ఏదో ఒకరోజు మళ్లీ టీమ్ ఇండియా తరఫున అడుతాను అంటూ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2013 ఎడిషన్ కోసం శిఖర్ ధావన్ సన్నద్ధం అవుతోన్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు శిఖర్ ధావన్ ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు.
టాపిక్