(1 / 5)
వరంగల్లోని రంగలీలా మైదానంలో రావణ వధ ఘనంగా నిర్వహించారు. రావణుడి భారీ దిష్టిబొమ్మను తయారి చేసి.. బాంబులతో పేల్చి బూడిద చేశారు. ఈ రావణ వధను చూసేందుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారని నిర్వాహకులు చెప్పారు.
(2 / 5)
100 ఏళ్లకు పైగా ఈ సంప్రదాయం వరంగల్లో కొనసాగుతోంది. 1920లలో రావణుడి పోస్టర్ను దహనం చేయడంతో మొదలైంది. స్వాతంత్య్రానంతరం బట్టలతో చేసిన దిష్టిబొమ్మను దహనం చేశారు.
(3 / 5)
10 తలల రావణుడి ప్రతిమను తయారుచేయడానికి రూ. 15 లక్షలకు పైగా ఖర్చయింది. రావణ దహనం సమయంలో అద్భుతమైన ప్రదర్శన జరిగేలా క్రాకర్స్ ఏర్పాటు చేశారు. నెల్లూరు నుండి నిపుణులను రప్పించి.. దిష్టిబొమ్మకు లోపల క్రాకర్స్ను చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు.
(4 / 5)
ఈ వేడుకల్లో రావణ దహనం తోపాటు క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో.. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులను మోహరించారు.
(5 / 5)
మంత్రి కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, రావణ వధలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ఉన్నతాధికారులు రావణ వధలో పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు