(1 / 5)
వరంగల్ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
(2 / 5)
చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని పొంగులేటి తెలిపారు. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని.. హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.
(3 / 5)
భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని చెప్పారు.
(4 / 5)
భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు.
(5 / 5)
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.
ఇతర గ్యాలరీలు