(1 / 5)
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్టు.. దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది.
(@SCRailwayIndia)(2 / 5)
రూ.39.9 కోట్ల వ్యయంతో.. కామారెడ్డి స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రపోస్డ్ డిజైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసింది.
(@SCRailwayIndia)(3 / 5)
దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లను అభివృద్ధి చేయడానికి.. రైల్వే మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2023లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ను ప్రారంభించింది.
(@SCRailwayIndia)(4 / 5)
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో తెలంగాణలోని నాంపల్లి, సికింద్రాబాద్, మలక్పేట్, మల్కాజ్గిరి, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, బేగంపేట్, ఉమ్దానగర్, యాకుత్పురా, మేడ్చల్, జడ్చర్ల, కరీంనగర్, కాజీపేట జంక్షన్, జనగాం, కాచిగూడ, తాండూర్, వికారాబాద్, ఆదిలాబాద్, బాసర, భద్రాచలం రోడ్, మిర్యాలగూడ, నల్లగొండ, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, షాద్నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్, రాయగిరి (యాదాద్రి), జహీరాబాద్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
(@SCRailwayIndia)(5 / 5)
తొలి విడతలో నాంపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, మహబూబాదాద్, మలక్ పేట, మల్కాజ్గిరి, ఉప్పగూడ, హఫీజ్పేట, హైటెక్ సిటీ, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మధిర, జనగామ, యాదాద్రి (రాయగిరి), కాజీపేట జంక్షన్, తాండూరు, భద్రాచలం రోడ్, జహీరాబాద్, ఆదిలాబాద్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
(@SCRailwayIndia)ఇతర గ్యాలరీలు