
(1 / 5)
జింబాబ్వేతో నేడు (జూలై 10) హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టుకు ఇది 150వ అంతర్జాతీయ టీ20 విజయంగా ఉంది.
(AFP)
(2 / 5)
అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత దక్కించుకున్న ఫస్ట్ టీమ్గా ఘనత దక్కించుకుంది. ఇప్పటి వరకు 230 అంతర్జాతీయ టీ20ల్లో 150 గెలిచింది భారత్.
(AP)
(3 / 5)
ఇప్పటి వరకు అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు గెలిచిన జట్ల జాబితాలో భారత్ (150) అగ్రస్థానంలో ఉంది. 142 గెలుపులతో పాకిస్థాన్ రెండో ప్లేస్లో ఉంది. న్యూజిలాండ్ (111), ఆస్ట్రేలియా (105), దక్షిణాఫ్రికా (104) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
(AP)
(4 / 5)
జింబాబ్వేతో మూడో టీ20లో భారత యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (66) అర్ధ శకతంతో రెచ్చిపోగా.. రుతురాజ్ గైక్వాడ్ (49) రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది.
(AFP)
(5 / 5)
లక్ష్యఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ గెలిచింది. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో రాణించాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది.
(AP)ఇతర గ్యాలరీలు