(1 / 8)
ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు శాండ్ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలు ఇకపై ఆన్లైన్లో ఇసుకను నేరుగా బుక్ చేసుకోవచ్చు.
(2 / 8)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇసుక రవాణాపై నిఘా ఉంచుతూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4599
(3 / 8)
ఉచిత ఇసుక రవాణాలో రాష్ట్ర వ్యాప్తంగా లారీలకు నిర్దిష్ట ఛార్జీలను నిర్ణయించారు. వాటిని మాత్రమే రవాణాకు అమలు చేయాలి. అధికంగా వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తారు. ప్రతి లారీకి జీపీఎస్ అనుసంధానం చేస్తారు.
(4 / 8)
ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు సవరిస్తున్నారు.
(5 / 8)
వాగులు, వంకలు, గ్రామీణ ప్రజలు ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తరలింపుపై ఎలాంటి ఆంక్షలు లేకుండా తీసుకువెళ్లొచ్చు
(6 / 8)
ఉచిత ఇసుక విధానంలో తలెత్తే సమస్య ల పరిష్కారం కోసం టోల్ఫ్రీ నంబర్ 1800 599 4599కు ఫిర్యాదు చేయొచ్చు
(7 / 8)
ఉచిత ఇసుక పోర్టల్ ద్వారా 24 గంటలు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవచ్చు
(8 / 8)
ఇసుక రీచ్లలో అందుబాటులో ఉన్న ఇసుకను ప్రజలు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా కల్పించారు.
ఇతర గ్యాలరీలు