NEET 2022: నీట్ ర్యాంక్ సాధించిన మారుమూల గిరిజన విద్యార్థులు-four tribal students from remote hamlets clear neet 2022 ,national న్యూస్
తెలుగు న్యూస్  /  National  /  Four Tribal Students From Remote Hamlets Clear Neet 2022

NEET 2022: నీట్ ర్యాంక్ సాధించిన మారుమూల గిరిజన విద్యార్థులు

HT Telugu Desk HT Telugu
Sep 11, 2022 10:43 AM IST

NEET 2022: మారుమూల గిరిజన విద్యార్థులు అనేక కష్టనష్టాలకోర్చి నీట్ ర్యాంకులు సాధించారు.

నీట్ రాసిన విద్యార్థులు (ప్రతీకాత్మక చిత్రం)
నీట్ రాసిన విద్యార్థులు (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)

చార్లెస్ సాల్వే నాగ్‌పూర్, సెప్టెంబర్ 11: మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు చెందిన నలుగురు గిరిజన విద్యార్థులు వైద్య ప్రవేశ పరీక్ష NEET 2022లో ఉత్తీర్ణత సాధించారు. తద్వారా వైద్యులు కావాలని, సమాజానికి సేవ చేయాలనే వారి కలను సాకారం చేసుకోవడానికి ఒక అడుగు దగ్గరకు చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

వ్యవసాయ కార్మికులు, సన్నకారు రైతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు సెప్టెంబర్ 8న వెలువడ్డాయి. 18 ఏళ్ల అరుణ్ లాల్సు మట్టామి మాట్లాడుతూ తాను వైద్యుడిగా కావాలని కలలు కంటున్నట్లు చెప్పాడు. అతను నివసించిన చోట విద్యావకాశాలు అందుబాటులో లేవు.

అరుణ్ భమ్రాగడ్ తాలూకాలోని గిరిజన కుగ్రామానికి చెందినవాడు. అతను 4వ తరగతి నుండి అహేరిలో, 12వ తరగతి భామ్రాగడ్‌లోని హాస్టల్‌లో ఉంటూ తన చదువును కొనసాగించాడు. తను మాదియా గోండ్ కమ్యూనిటీకి చెందిన యువకుడు. ప్రత్యేక గిరిజన సమూహంగా వర్గీకరించిన తెగకు చెందిన యువకుడు. NEET-2022లో 720కి 450 స్కోర్ చేశాడు. అరుణ్ తల్లిదండ్రులు జీవనోపాధి కోసం కూలీ పనులు చేసుకుంటారు.

“నా కుటుంబం కోచింగ్ ఫీజు భరించలేని కారణంగా నీట్‌కు హాజరు కావడంపై నాకు సందేహం కలిగింది. అయినప్పటికీ, నా ఉపాధ్యాయుల్లో ఒకరు నన్ను ఉచిత కోచింగ్‌ను అందించే లిఫ్ట్ ఫర్ అప్‌లిఫ్ట్‌మెంట్ (LFU) సహాయం తీసుకున్నారు.. ” అని మట్టామి చెప్పారు.

పూణేలోని B J మెడికల్ కాలేజీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్థాపించిన LFU ప్రైవేట్ కోచింగ్‌కు ప్రాప్యత లేని, ఆర్థిక స్థోమత లేని, అణగారిన విద్యార్థులకు అండగా ఉంటుంది. అయినప్పటికీ, ఆన్‌లైన్ తరగతులకు ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్‌లతో కూడిన ప్రాజెక్ట్‌కి మారాల్సి రావడంతో అరుణ్ ప్రయాణం సాఫీగా సాగలేదు.

అతను మార్చి 2021 నుండి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు NEET కోసం సిద్ధమయ్యాడు. LFU నుండి సలహాదారులచే మార్గనిర్దేశం అందుకున్నాడు.

సప్నా జవర్కర్ (17) నీట్‌ కోసం ప్రయత్నించడంలో భాష ప్రధాన అడ్డంకిలలో ఒకటి. అమరావతి జిల్లాలోని మెల్‌ఘాట్‌లోని మఖ్లా గ్రామానికి చెందిన ఓ సన్నకారు రైతు కుమార్తె సప్న మాట్లాడుతూ.. "పరీక్షకు చదవడం నాకు చాలా కష్టమైంది. ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించడంతో భాష అడ్డంకిగా ఉంది..’ అని అన్నారు. సప్నా, అరుణ్‌తో పాటు, భామ్రాగడ్‌కు చెందిన గిరిజన విద్యార్థులు సచిన్ అర్కి, రాకేష్ పొడాలి కూడా ఎల్‌ఎఫ్‌యులోని మెంటర్ల నిపుణుల మార్గదర్శకత్వంతో పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

WhatsApp channel

టాపిక్