Odisha train accident live : ఒడిశా రైలు ప్రమాదంలో 223మంది మృతి..-odisha train accident live update more than 200 killed and 900 hurt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Odisha Train Accident Live : ఒడిశా రైలు ప్రమాదంలో 223మంది మృతి..

Odisha train accident live : ఒడిశా రైలు ప్రమాదంలో 223మంది మృతి..

Sharath Chitturi HT Telugu
Jun 03, 2023 07:14 AM IST

Odisha train accident live : ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 220 దాటింది. మరో 900మంది గాయపడ్డారు.

ఘటనాస్థంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఘటనాస్థంలో కొనసాగుతున్న సహాయక చర్యలు (Sarangadhara Bishnoi)

Odisha train accident live updates : యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మహా విషాదంలో ఇప్పటివరకు 223మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 900మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. దేశ చరిత్రలోనే అతి భయంకరమైన, అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా ఈ ఘటన నిలిచిపోతుంది!

అసలేం జరిగింది..?

శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో.. బాలాసోర్​లోని బహనాగా రైల్వే స్టేషన్​కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత 12864 బెంగళూరు- హౌరా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. పక్కనే ఉన్న పట్టాలపై బోగీలు పడ్డాయి. అటుగా వస్తున్న 12841 షాలిమార్​ చెన్నై సెంట్రల్​ కోరమండల్​ ఎక్స్​ప్రెస్​.. పట్టాలపై పడిన బోగీలను ఢీకొట్టింది. ఫలితంగా ఈ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఆ బోగీలు మరో ట్రాక్​పై పడగా.. అటుగా వెళుతున్న ఓ గూడ్స్​ రైలు వాటిని ఢీకొట్టింది. ఫలితంగా గూడ్స్​ రైలు సైతం ప్రమాదానికి గురైంది.

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పందించారు. ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ ప్రాంతమంతా అంబులెన్స్​ల సైరన్​ మోతమోగిపోయింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల బంధువుల ఆర్థనాథాలతో ఆసుపత్రుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

'జీవితంలో మర్చిపోలేను..'

Odisha train accident death toll : ఘటనాస్థలంలో పరిస్థితులు భయానకంగా ఉన్నట్టు రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు వెల్లడించాడు.

"రైలు పట్టాలు తప్పడంతో నాకు మెలుకువ వచ్చింది. అప్పటికే నా మీద 10-15మంది పడ్డారు. నా తల, మెడకు గాయాలయ్యాయి. ఎలాగో అలా బయటకు రాగలిగాను. కానీ అప్పుడే నా శరీరంపై వేరొకరి చేతులు, కాళ్లు చూశాను. రైలులో కొందరి ముఖాలు పూర్తిగా చిద్రమైపోయింది," అని ఆ ప్రయాణికుడు మీడియాకి వివరించాడు.

సంతాప దినం..

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు సంతాప దినంగా ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నవీన్​ పట్నాయక్​. నేడు సంఘటనాస్థలానికి వెళ్లనున్నట్టు ప్రకటించారు.

మరోవైపు.. వాలంటీర్ల శ్రమను ప్రశంసించారు ఒడిశా చీఫ్​ సెక్రటరీ జేనా.

"బాలాసోర్​లో రాత్రికి రాత్రే 500కుపైగా బ్లడ్​ యూనిట్​లు సేకరించారు. ప్రస్తుతం 900 యూనిట్​ల స్టాక్​ ఉంది. ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకు ఇవి ఉపయోగపడతాయి. రక్తదానం చేసి సరైన సమయంలో సాయం చేసిన వాలంటీర్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను," అని జేనా అన్నారు.

ప్రధాని దిగ్భ్రాంతి..

Coromandel express accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రకటించారు. ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​తో మాట్లాడినట్టు వివరిచారు.

మరోవైపు ఘటనకు గల కారణాలను కనుగొనేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​. త్వరలో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం