Today Gold Rate September 17th : మళ్లీ పెరిగిన బంగారం ధర, వెండి ధర కూడా పైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా-today gold rate gold and silver price on september 17th 2024 check in hyderabad telangana and vijayawada andhra pradesh ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate September 17th : మళ్లీ పెరిగిన బంగారం ధర, వెండి ధర కూడా పైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

Today Gold Rate September 17th : మళ్లీ పెరిగిన బంగారం ధర, వెండి ధర కూడా పైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

Anand Sai HT Telugu

Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు సైతం పైకి వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి రూ. 68,810కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 68,800గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 6,88,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,881గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 పెరిగి రూ. 75060గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 75,050గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 7,50,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,506గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,160గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 75,060గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,810గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,060గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,810గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 75,060గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,060గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.68,860గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,060గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,060గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు మంగళవారం మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9310గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 93,100గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 93,000గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 98,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 93,100.. బెంగళూరులో రూ. 86,100గా ఉంది.

ప్లాటీనం ధరలు

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం కాస్త పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 పెరిగి రూ. 26,890కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,800గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,890గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.