తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా వచ్చారు. ఆటోల్లో వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఆటో కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని కోరుతూ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పరిస్థితి ఆందోళన కరంగా తయారైందని అన్నారు.