(1 / 5)
ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ బోగీలు చెన్నైలోని ఐసీఎఫ్లో తయారవుతున్నాయి. ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన ఒక బోగీని ఐసీఎఫ్ అధికారులు విడుదల చేశారు.
(@trainwalebhaiya)(2 / 5)
బోగీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. 1200 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయని అధికారులు వివరించారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పయనించేలా ఏర్పాట్లు చేశారు.
(@trainwalebhaiya)(3 / 5)
ఈ స్లీపర్ క్లాస్ కోచ్ల్లో మొబైల్ ఛార్జింగ్, మ్యాగజైన్లు, టేబుల్, సామగ్రి కోసం విశాల స్థలం, చిన్నపాటి లైట్, వేడి నీరు, సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో డ్రైవరుతో మాట్లాడే సౌకర్యం ఉంది.
(@trainwalebhaiya)(4 / 5)
ట్రయల్స్ కోసం లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్కు పంపనున్నారు. ఆ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒక్కో ట్రైన్లో 11 త్రీ టైర్ ఏసీ కోచ్లు, 4 టూ టైర్ ఏసీ కోచ్లు, ఒకటి ఫస్ట్ క్లాస్ కోచ్ ఉన్నాయి. మొత్తం 823 మంది దీంట్లో ప్రయాణిచవచ్చు.
(@trainwalebhaiya)(5 / 5)
స్లీపర్ క్లాసులు ఉన్న వందేభారత్ రైళ్లలో వాష్ రూమ్లు కూడా బాగా డిజైన్ చేశారు. వెస్టర్న్, ఇండియన్ స్టైల్లో తీర్చిదిద్దారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటీరియర్ బాగుందని నెటిజన్లు కితాబు ఇస్తున్నారు.
(@trainwalebhaiya)ఇతర గ్యాలరీలు