Modi Temple visit: మోదీ ఆలయ సందర్శన: ఉత్తరాఖండ్ లోని ఆది కైలాస, పార్వతి కుండ్ లో ధ్యానం-uttarakhand news pm modi visited uttarakhand pilgrim places offered pujas traditional attire ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Modi Temple Visit: మోదీ ఆలయ సందర్శన: ఉత్తరాఖండ్ లోని ఆది కైలాస, పార్వతి కుండ్ లో ధ్యానం

Modi Temple visit: మోదీ ఆలయ సందర్శన: ఉత్తరాఖండ్ లోని ఆది కైలాస, పార్వతి కుండ్ లో ధ్యానం

Published Oct 12, 2023 06:40 PM IST HT Telugu Desk
Published Oct 12, 2023 06:40 PM IST

Modi Temple visit: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం పార్వతీ కుండ్ ను సంప్రదాయ దుస్తులు ధరించి దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆదికైలాస పర్వతానికి ఎదురుగా కూర్చుని.. గంటన్నర పాటు ధ్యానం చేశారు.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్ ఘర్‌లోని శివపార్వతి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులలో పూజలు చేశారు.

(1 / 7)

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్ ఘర్‌లోని శివపార్వతి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులలో పూజలు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని కైలాసపర్వతం వద్ద శివపార్వతుల ఆలయం ముందున్న శివలింగానికి పూజలు చేశారు. మోదీ వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.

(2 / 7)

ఉత్తరాఖండ్‌లోని కైలాసపర్వతం వద్ద శివపార్వతుల ఆలయం ముందున్న శివలింగానికి పూజలు చేశారు. మోదీ వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం పిథోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్ నకు వెళ్లి అక్కడి నుంచి ఆది కైలాస శ్రేణిలో కొలువై ఉన్న శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.

(3 / 7)

ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం పిథోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్ నకు వెళ్లి అక్కడి నుంచి ఆది కైలాస శ్రేణిలో కొలువై ఉన్న శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.

శివపార్వతుల ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే సంప్రదాయ దుస్తులతో సమీపంలోని ఆది కైలాస పర్వతానికి బయలుదేరారు. అక్కడ కొంతసేపు కూర్చుని ధ్యానం చేశారు.

(4 / 7)

శివపార్వతుల ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే సంప్రదాయ దుస్తులతో సమీపంలోని ఆది కైలాస పర్వతానికి బయలుదేరారు. అక్కడ కొంతసేపు కూర్చుని ధ్యానం చేశారు.

ఉత్తర ఖండంలోని ఆదికైలాస పర్వతానికి ముందు కూర్చుని ప్రధాని మోదీ కాసేపు ధ్యానం చేశారు. ధ్యానం అనంతరం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉందన్నారు.

(5 / 7)

ఉత్తర ఖండంలోని ఆదికైలాస పర్వతానికి ముందు కూర్చుని ప్రధాని మోదీ కాసేపు ధ్యానం చేశారు. ధ్యానం అనంతరం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉందన్నారు.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్‌ఘర్‌లోని సరస్సు, ఆ వెనుకగా కనిపించే హిమాలయం ముందు మోదీ మౌనంగా కూర్చుని ధ్యానం చేశారు. గతంలో కూడా మోదీ ఇలాగే పలుమార్లు హిమాలయాలను సందర్శించారు.

(6 / 7)

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్‌ఘర్‌లోని సరస్సు, ఆ వెనుకగా కనిపించే హిమాలయం ముందు మోదీ మౌనంగా కూర్చుని ధ్యానం చేశారు. గతంలో కూడా మోదీ ఇలాగే పలుమార్లు హిమాలయాలను సందర్శించారు.

పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతీ కుండ్ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇక్కడి నుంచి ఆది కైలాస దర్శనంతో మనస్సులొ ప్రశాంతత నెలకొన్నదన్నారు. దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థించానన్నారు.

(7 / 7)

పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతీ కుండ్ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇక్కడి నుంచి ఆది కైలాస దర్శనంతో మనస్సులొ ప్రశాంతత నెలకొన్నదన్నారు. దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థించానన్నారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు