(1 / 6)
ఏపీలోని మందుబాబులకు కిక్కేంచే వార్త వచ్చేసింది. కొన్ని కంపెనీలు బేసిక్ ప్రైస్ను తగ్గించుకున్నాయి. ఈ మేరకు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో మద్యం ధరలు కూడా తగ్గనున్నాయి.
(unshplash.com)(2 / 6)
దాదాపు ఏపీలోని పదికిపైగా కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్ను తగ్గించుకున్నాయి. దీంతో ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది.
(3 / 6)
ఈ తగ్గించిన ధరలతో ఆయా బ్రాండ్లను బట్టి.. ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.
(istockphoto)(4 / 6)
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు దాటింది. మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై కూడా సిఫారసు చేయనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అయితే కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకుంటున్నాయి.
(5 / 6)
హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించనుంది.
(6 / 6)
ఏపీ, తెలంగాణలో విక్రయించే బ్రాండ్ల ధరల్లో భారీ వ్యత్యాసాలుంటే వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈక్రమంలోనే కొన్ని కంపెనీలు ముందు జాగ్రత్తగా ధరలు తగ్గిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఇతర గ్యాలరీలు