దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 445 పాయింట్లు పెరిగి 80,248 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 145 పాయింట్లు వృద్ధి చెంది 24,276 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 52,109 వద్దకు చేరింది.
“నిఫ్టీ 50 ఇండెక్స్ షార్ట్టర్మ్ ట్రెండ్ సానుకూలంగా ఉంది. వచ్చే రెండు సెషన్లలో 24350 పైనే కొనసాగితే, తదుపరి రెసిస్టెన్స్ జోన్ 24700-24900 స్థాయిల వైపు పయనించవచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. 24100 వద్ద సపోర్ట్ ఉందని పేర్కొన్నారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 238.28 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3588.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.29శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.24శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.97శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
అఫిల్ ఇండియా లిమిటెడ్- బై రూ. 1736.2, స్టాప్ లాస్ రూ. 1670, టార్గెట్ రూ. 1870
ఇగరాశి మోటార్స్- బై రూ . 823.15, స్టాప్ లాస్ రూ. 796, టార్గెట్ రూ. 875.
టాటా కమ్యూనికేషన్స్- బై రూ. 1790, స్టాప్ లాస్ రూ. 1740, టార్గెట్ రూ. 1850
ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 156, స్టాప్ లాస్ రూ. 150, టార్గెట్ రూ. 165
ఎల్ అండ్ టీ ఫైనాన్స్- బై రూ. 143.75, స్టాప్ లాస్ రూ. 140, టార్గెట్ రూ. 148
నెల్కో: రూ.1234.90 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1305, స్టాప్ లాస్ రూ.1192;
మాలు పేపర్ మిల్స్: రూ.52.96కు కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.57, స్టాప్ లాస్ రూ.51;
పోకర్ణ: రూ.1225.10 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1333, స్టాప్ లాస్ రూ.1180;
డీఎంసీసీ: రూ.328.50, టార్గెట్ రూ.350, స్టాప్ లాస్ రూ.316;
సియారాం సిల్క్ మిల్స్: రూ.866.85 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.930, స్టాప్ లాస్ రూ.835.
సంబంధిత కథనం