TDP Mahanadu 2023 Updates: రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. వైసీపీ పాలనపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓవైపు వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూనే... జగన్ పై మండిపడితున్నారు. అయితే ఇదే వేదికగా యువకుడైన దర్షిత్ స్పీచ్ అదరగొట్టాడు. వైసీపీ పాలనపై ఫైర్ అవుతూనే... చంద్రబాబు పాలనను గుర్తు చేశాడు. ప్రసంగం పూర్తి అయిన తర్వాత... ఆ కుర్రాడిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.