(1 / 5)
ఆసియాకప్ 2024 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగించింది. దంబుల్లా వేదికగా నేడు జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో నేపాల్పై విజయం సాధించింది. ఇప్పటికే పాకిస్థాన్, యూఏఈని ఓడించిన భారత్.. తుది గ్రూప్ మ్యాచ్లో నేపాల్ను మట్టికరిపించింది.
(Nepal Cricket- X)(2 / 5)
గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో భారత్ దుమ్మురేపింది. గ్రూప్-ఏలో మూడింట మూడు గెలిచి సెమీస్లో జోష్తో అడుగుపెట్టింది.
(BCCI- X)(3 / 5)
నేపాల్తో నేటి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (48 బంతుల్లో 81 పరుగులు;12 ఫోర్లు, ఓ సిక్స్) ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టారు. అర్ధ శకతం చేశారు. దయాలన్ హేమలత (42 బంతుల్లో 47 పరుగులు) రాణించారు. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ విశ్రాంతి తీసుకోవటంతో స్మృతి మంధాన సారథ్యం వహించారు.
(BCCIWomen - X)(4 / 5)
టీమిండియా బౌలర్లు విజృంభించటంతో లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 96 పరుగులే చేసింది. నేపాల్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగుల మార్క్ చేరలేదు. ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. సితా రాణా మగర్ (18) ఆ జట్టులో టాప్ స్కోరర్. భారత బౌలర్ దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. రాధాయాదవ్, అరుంధతీ యాదవ్ తలా రెండు, రేణుక సింగ్ ఓ వికెట్ తీసుకున్నారు.
(BCCI- X)(5 / 5)
ఆసియాకప్ 2024లో సెమీఫైనల్స్ జూలై 26, జూలై 28న జరగనున్నాయి. రేపు (జూలై 24) జరిగే గ్రూప్ మ్యాచ్ల తర్వాత సెమీస్లో భారత ప్రత్యర్థి ఖరారవుతుంది.
(BCCI- X)ఇతర గ్యాలరీలు