మనకు ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం ప్రతిరోజూ ఒక వెరైటీ తినాలని కోరుకుంటాం. సాంబార్ ఇడ్లీ, మసాల దోశ, పూరీ కుర్మా, మైసూర్ బజ్జీ లేదా ఉప్మా ఇవన్నీ మనం ఎప్పుడూ తినేవే. ఇంకాస్త కొత్తగా కోరుకుంటే మీరు నుచ్చినుండే అల్పాహారాన్ని (Nuchinunde Dumplings) ప్రయత్నించవచ్చు. ఈ నుచ్చినుండే అనేది పప్పుధాన్యాలతో చేసే కుడుములు, వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు.
ఈ ఆవిరి కుడుము (steamed lentil dumplings) లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన, సాంప్రదాయ అల్పాహార వంటకం. కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు. పిండి, నూనెలు లేకుండా చేయడం వలన ఇవి ఉదయం వేళ చాలా తేలికైన అల్పాహారంగా ఉంతాయి. ముఖ్యంగా వారంతంలో విందులు ఎక్కువగా జరుగుతాయి, ఆ తర్వాత కడుపు శుద్ధి జరగాలంటే కాస్త తేలికైనవి అల్పాహారాలు తినాలి. అందుకు ఈ పప్పు కుడుములు అద్బుతంగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, తయారీ విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. మరి మీరూ ఈ ఆవిరి పప్పు కుడుములు తినాలనుకుంటే నుచ్చినుండే రెసిపీ ఇక్కడ ఇచ్చాం, ఇలా ఒకసారి ప్రయత్నించండి.
అంతే వేడివేడి ఆవిరి కుడుములు రెడీ, పచ్చిమిర్చి పచ్చడి, రెడ్ చట్నీ అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటాయి.
సంబంధిత కథనం