MS Dhoni : ‘ధోనీ టీ20 వరల్డ్​ కప్​ ఆడాలి.. ఎంఎస్​కి మించిన ప్లేయర్​ ఎవరున్నారు?’-virendra sehwag explains why ms dhoni should be in indias squad for t20 wc 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni : ‘ధోనీ టీ20 వరల్డ్​ కప్​ ఆడాలి.. ఎంఎస్​కి మించిన ప్లేయర్​ ఎవరున్నారు?’

MS Dhoni : ‘ధోనీ టీ20 వరల్డ్​ కప్​ ఆడాలి.. ఎంఎస్​కి మించిన ప్లేయర్​ ఎవరున్నారు?’

Sharath Chitturi HT Telugu
Apr 23, 2024 12:05 PM IST

Virendra Sehwag on MS Dhoni : ఎంఎస్​ ధోనీని టీ20 వరల్డ్​లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్​. ఒక ప్లాన్​ కూడా చెప్పాడు.

ఎంఎస్​ ధోనీ..
ఎంఎస్​ ధోనీ.. (AFP)

T20 World Cup 2024 : టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. ఇంటర్నేషనల్​ క్రికెట్​కి గుడ్​ బై చెప్పి చాలా కాలమైంది. అతను కేవలం ఐపీఎల్​ మ్యాచ్​లు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ధోనీ బ్యాటింగ్​, ఫీల్డ్​లో అతని వికెట్​ కీపింగ్​ చూస్తుంటే అలా లేదు! తన కెమీయోలతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు సీఎస్కే మాజీ కెప్టెన్​. అందుకే.. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్​ కప్​లో ధోనీ కూడా ఆడాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి టీమిండియా డాషింగ్​ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ కూడా చేరాడు. సెహ్వాగ్​ మరో మెట్టెక్కి.. ఓ ప్లాన్​ కూడా చెప్పాడు. ఆ ప్లాన్​ ప్రకారం టీ20 వరల్డ్​ కప్​లో ధోనీని ఆడిస్తే.. టీమిండియా కచ్చితంగా ట్రోఫీని సాధిస్తుందని అంటున్నాడు.

'ధోనీని టీ20 వరల్డ్​ కప్​లో ఆడించాలి..'

టీ20 వరల్డ్​ కప్​లో ధోనీని ఆడించాలంటూ.. క్రిక్​బజ్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్​.

"ఈ ఐపీఎల్​ 2024లో ధోనీ స్ట్రైక్​ రేట్​ 255గ ఉంది. ఔటే అవ్వలేదు కాబట్టి.. యావరేజ్​ లేదు. 34 బాల్స్​ ఆడి 87 రన్స్​ చేశాడు. టీ20 వరల్డ్​ కప్​ షెడ్యూల్​ చూస్తే.. మనం ఎన్ని మంచి టీమ్స్​ తలపడతాము? ఫస్ట్​ రౌండ్​లో ధోనీ పెద్దగా ఆడకపోవచ్చు. కేవలం కీపింగ్​ చేయాలి. ఇప్పుడు సీఎస్కేకి ఎలాగో అదే చేస్తున్నాడు. ధోనీ.. కచ్చితంగా మూడు మ్యాచ్​లలో బ్యాటింగ్​కి దిగాలి. ఒకటి ఆస్ట్రేలియా, రెండు న్యూజిలాండ్​, మూడు సౌతాఫ్రికా. పాకిస్థాన్​ని కూడా లెక్కలో వేసుకుంటే.. నాలుగు టీమ్​లు అవుతాయి. అది కూడా చివరి 3 ఓవర్లలో వచ్చి బ్యాటింగ్​ చేయాలి. ఈ విషయంలో ధోనీకి మంచిన ప్లేయర్​ ఎవరుంటారు?" అని వీరేంద్ర సెహ్వాగ్​ అభిప్రాయపడ్డాడు.

T20 World Cup 2024 India squad : ధోనీ మళ్లీ బ్లూ జెర్సీ వేసుకుంటే.. ఇక ఫ్యాన్స్​ సంతోషానికి కొదవుండదు. కానీ ధోనీ టీ20 వరల్డ్​ కప్​లో ఆడటం జరగని పని! పైగా.. ఈ ఐపీఎల్​ 2024లో అతని చివరి సీజన్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ధోనీ మోకాలి నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే రికవర్​ అవుతున్నాడన్న విషయం మర్చిపోకూడదు.

టీ20 స్క్వాడ్​లో ఆ స్థానం దక్కేది ఎవరికి?

టీమిండియా టీ20 వరల్డ్​ కప్​ స్క్వాడ్​లో విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్ప్రీత్​ బూమ్రాలు కచ్చితంగా ఉంటారు. అయితే.. ఇక్కడ వికెట్​ కీపర్​ పొజీషన్​కే టప్​ ఫైట్​ కనిపిస్తోంది. రిషభ్​ పంత్​, సంజూ సామ్​సన్​, ఇషాన్​ కిషన్​, దినేశ్​ కార్తిక్​.. ఇలా రేసులో గట్టి పేర్లే ఉన్నారు.

T20 World Cup 2024 squad : మరీ ముఖ్యంగా.. ఆర్సీబీ బ్యాటర్​, వికెట్​ కీపర్​ దినేశ్​ కార్తిక్​.. తన ఫామ్​తో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. 38ఏళ్ల దినేశ్​ కార్తిక్​ కచ్చితంగా టీ20 వరల్డ్​ కోసం వెళ్లే టీమిండియా జట్టులో ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్​ 2024లో ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడిన కార్తిక్​.. 251 రన్స్​ చేశాడు. అతని స్ట్రైక్​ రేట్​ 196.09గా ఉంది. యావరేజ్​ 62.75. హయ్యెస్ట్​ స్కోర్​ 83.

మరి.. ఇంతటి టఫ్​ ఫైట్​లో.. టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం