Underwater Metro। త్వరలోనే నీటి అడుగున మెట్రో రైల్ పరుగులు, భారతదేశంలోనే మొదటిది-indias 1st underwater metro in kolkata to be open by june 2023 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Underwater Metro। త్వరలోనే నీటి అడుగున మెట్రో రైల్ పరుగులు, భారతదేశంలోనే మొదటిది

Underwater Metro। త్వరలోనే నీటి అడుగున మెట్రో రైల్ పరుగులు, భారతదేశంలోనే మొదటిది

Published Aug 10, 2022 07:02 PM IST HT Telugu Desk
Published Aug 10, 2022 07:02 PM IST

భారతదేశంలోనే నీటి అడుగున మెట్రో రైలును కలిగి ఉన్న మొట్టమొదటి నగరంగా కోల్‌కతా త్వరలోనే రికార్డులకు ఎక్కనుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (KMRC) ఆధ్వర్యంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తూర్పు-పశ్చిమ కారిడార్ (underwater metro) ప్రాజెక్ట్ జూన్ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. హౌరా నుంచి వయా కోల్‌కతా సాల్ట్ లేక్‌ వరకు వెళ్లే ఈ మెట్రో లైన్ హుగ్లీ నదికి దిగువన నీటి అడుగున ప్రయాణమార్గాన్ని కలిగి ఉంటుంది. డిసెంబరు 2021 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావించినప్పటికీ సొరంగం నిర్మాణ సమయంలో సెంట్రల్ కోల్‌కతాలోని ఒక ప్రాంతంలో ప్రమాదాల కారణంగా ఆలస్యమైంది. భూగర్భంలో చేపట్టిన పనుల కారణంగా అదే ప్రాంతంలో అనేక ఇళ్లకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పనుల్లో మరింత జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. మొత్తం ప్రాజెక్ట్ పొడవు 16.55 కి.మీ కాగా, ఇప్పటికే 9.30 కి.మీ ట్రాక్ పూర్తయింది. మిగిలిన 7.25 కి.మీ పొడవు ఏడాది లోపు పూర్తి కానుందని నివేదికలు తెలిపాయి. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

More