Krishnamma Kalipindhi Iddarini: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్ రివీల్ చేసిన స్టార్ మా
Krishnamma Kalipindhi Iddarini: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ వచ్చేస్తోంది. స్టార్ మా దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ కొత్త సీరియల్ ను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నట్లు చెప్పింది.
Krishnamma Kalipindhi Iddarini: తెలుగులో టాప్ సీరియల్స్ కు పెట్టింది పేరైన స్టార్ మాలో మరో సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ పేరు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. నిజానికి నెల రోజుల కిందటే ఈ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా. అప్పట్లో త్వరలోనే ఈ సీరియల్ ప్రారంభం కాబోతోందని చెప్పింది.
అయితే తాజాగా బుధవారం (మే 3) ఈ సీరియల్ కు సంబంధించిన మరో ప్రోమో రిలీజ్ చేస్తూ టెలికాస్ట్ అయ్యే తేదీని అనౌన్స్ చేసింది. ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ వచ్చే మంగళవారం (మే 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానున్నట్లు స్టార్ మా తన ట్విటర్ అకౌంట్ ద్వారా చెప్పింది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త ప్రోమో కూడా ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది. తొలి ప్రోమోలోనే ఈ సీరియల్ లో హీరోకు కళ్లు కనిపించని విషయాన్ని చూపించి ఆసక్తి రేపారు. గుడిలో తొలిసారి హీరో, హీరోయిన్లు కలిసినట్లుగా అందులో చూపించారు. అయితే తాజా ప్రోమోలో హీరోయిన్ ను మరోసారి హీరో కలుస్తాడు. కేవలం స్పర్శ ద్వారా ఆమెను గుర్తిస్తాడు.
కారులో వెళ్తున్న హీరో.. ఆమె చేతి స్పర్శను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని కారు ముందు సైకిల్ పై వెళ్తున్న హీరోయిన్ అదుపు తప్పి కింద పడిపోతుంది. కారులో నుంచి దిగిన హీరో.. ఆమె దగ్గరికి వెళ్లి ఏం కాలేదు కదా అని అడుగుతూ పైకి లేవడానికి చేయి అందిస్తాడు. ఆమె చేతి స్పర్శ తగలగానే నవ్వుతూ అలా ఉండిపోతాడు.
ఎందుకలా చూస్తున్నారని అడగగానే.. ఆమె చేయి వదిలేసి వెనక్కి తిరిగి తన చేతి కర్రను తెరుస్తాడు. అది చూసిన హీరోయిన్ షాకవుతుంది. అతడికి కళ్లు కనిపించవన్న నిజం ఆమెకు తెలుస్తుంది. "నులి వెచ్చని వెలుగుని గుర్తు చేసిన శృతి మెత్తని ఙ్ఞాపకం.. ఇద్దరి జీవితాలను మళ్లీ పలకరిస్తుందా" అనే వాయిస్ ఓవర్ తో ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం