Muslim Couple Donation To TTD : శ్రీవారికి ముస్లిం దంపతుల భారీ విరాళం -muslim couple donates 1 crore to tirumala temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Muslim Couple Donates 1 Crore To Tirumala Temple

Muslim Couple Donation To TTD : శ్రీవారికి ముస్లిం దంపతుల భారీ విరాళం

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 10:09 PM IST

Tirumala Tirupati Devasthanam : తిరుమల శ్రీవారికి భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. తాజాగా ఆలయానికి ముస్లిం దంపతులు భారీ విరాళం ఇచ్చారు.

టీటీడీకి ముస్లిం దంపతుల విరాళం
టీటీడీకి ముస్లిం దంపతుల విరాళం

తిరుమల శ్రీవారికి భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. తాజాగా ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల భారీ విరాళాన్ని టీటీడీకి అందజేశారు. చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీ తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుని అనంతరం విరాళాన్ని అందజేశారు.

ముస్లిం దంపతులు విరాళం చెక్కులను శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ దంపతులు విరాళంలో రూ.87 లక్షలను పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు, మిగతా రూ.15 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.

TTD Special Darshan తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్ కోటాను కూడా సెప్టెంబరు 21 న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.

TTD Special Darshan నవంబర్ నెలలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొద‌ట వ‌చ్చిన వారికి మొద‌ట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేస్తారని టీటీడీ ప్రకటించింది.

నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవం జరిగే తేదీలు అంటే అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించ‌రు.భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌రు 20వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

IPL_Entry_Point