IRCTC Poorva Sandhya Tour: హైదరాబాద్ - తిరుమల ట్రిప్.. తక్కువ ధరలోనే ఈ 5 ప్రముఖ ఆలయాలకు వెళ్లి రావొచ్చు-irctc tourism announced latest poorva sandhya tour from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Latest Poorva Sandhya Tour From Hyderabad

IRCTC Poorva Sandhya Tour: హైదరాబాద్ - తిరుమల ట్రిప్.. తక్కువ ధరలోనే ఈ 5 ప్రముఖ ఆలయాలకు వెళ్లి రావొచ్చు

HT Telugu Desk HT Telugu
May 20, 2023 01:32 PM IST

IRCTC Poorva Sandhya Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ‘పూర్వ సంధ్య’ పేరుతో టూర్ అందుబాటులో ఉంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి,తిరుచానూర్, తిరుమల వెళ్లాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వీటి వివరాలు చూస్తే……

తిరుమల ప్యాకేజీ
తిరుమల ప్యాకేజీ

IRCTC Tourism Latest Packages: తిరుపతితోపాటుగా చుట్టు పక్కల ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ సిటీ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'పూర్వ సంధ్య'(Poorva Sandhya) పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తిరిగిరావొచ్చు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి టూర్ ప్రారంభవుతుంది. 3రాత్రులు, 4 రోజుల ప్యాకేజీ ఇదీ. ప్రస్తుతం ఈ టూర్ మే 28వ తేదీన అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Day - 1 : లింగంపల్లి నుంచి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 07:38 గంటలకు చేరుకుంటుంది. రాత్రంతా జర్నీలోనే ఉంటారు.

Day - 2: తిరుపతికి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.

Day - 3 : టిఫిన్స్ తర్వాత హోటల్‌ నుంచి చెక్ అవుట్ అవ్వాలి. వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . సాయంత్ర 06:25 గంటలకు రైలు ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్‌(Tirupati Railway Station) నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day - 4 : నల్గొండ(Nalgonda)కు 03:04 గంటలకు చేరుకుంటారు. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు వస్తారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

పూర్వ సంధ్య టూర్ టికెట్ ధరలు...

ఈ పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720 గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ధారించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేర్వురు ధరలు ఉన్నాయి. కింద ఇచ్చిన జాబితాలో వివరాలు చెక్ చేసుకోవచ్చు. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి టూర్ ప్యాకేజీని బుకింగ్ చేయవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం