PM Modi : ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన అమెరికా అధ్యక్షుడు.!
Joe Biden asks Modi's autograph : ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆటోగ్రాఫ్ అడిగినట్టు తెలుస్తోంది. జీ7 సదస్సులో భాగంగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
PM Modi latest news : జపాన్లో జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగారు!
ఇదీ జరిగింది..!
జీ7 సదస్సులో భాగంగా.. జో బైడెన్ మోదీ వద్దకు వెళ్లారు. నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లాలని తనకు వందలాది అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. అక్కడే ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్.. ఈ మాటలు విన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీకి.. గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లభించిన ఘన స్వాగతాన్ని గుర్తు చేశారు.
Joe Biden asks Modi's autograph : "ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లారు మోదీ. అక్కడ ఆయనకు 90వేలమందికిపైగా ప్రజలు ఘన స్వాగతం పలికారు," అని అన్నారు. భారీ సంఖ్యలో ప్రజలను మోదీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారని వారిద్దరు ఆశ్చర్యపోయారు.
ఇదీ చూడండి:- G7 Summit 2023 : జపాన్లో బిజీబిజీగా మోదీ.. జీ7 దేశాధినేతలతో సమావేశం..
ఈ నేపథ్యంలోనే.. "అయితే నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి," అని జో బైడెన్ అన్నట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురు ఆగ్రనేతలు నవ్వుతూ కనిపించినట్టు సమాచారం.
జపాన్లో మోదీ..
PM Modi Japan tour latest updates : మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ జపాన్కు వెళ్లారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొన్నారు. కాగా.. శనివారం సాయంత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంపై చర్చలు జరిపారు. శాంతి కోసం కృషి చేస్తామని మరోమారు హామీనిచ్చారు మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం