Zee Telugu New Serial: జీ తెలుగులో కొత్త సీరియల్ వచ్చేస్తోంది.. ఈ నెల 24 నుంచే..-zee telugu new serial to be aired from 24th of april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu New Serial To Be Aired From 24th Of April

Zee Telugu New Serial: జీ తెలుగులో కొత్త సీరియల్ వచ్చేస్తోంది.. ఈ నెల 24 నుంచే..

Hari Prasad S HT Telugu
Apr 18, 2023 04:38 PM IST

Zee Telugu New Serial: జీ తెలుగులో కొత్త సీరియల్ వచ్చేస్తోంది.. ఈ నెల 24 నుంచే టెలికాస్ట్ కానుంది. ఈ కొత్త సీరియల్ ఏంటి? ఏ టైమ్ లో వస్తుందో ఒకసారి చూద్దాం

రాధకు నీవేరా ప్రాణం సీరియల్
రాధకు నీవేరా ప్రాణం సీరియల్

Zee Telugu New Serial: తెలుగులో మరో కొత్త సీరియల్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. జీ తెలుగు ఛానెల్లో ఈ సీరియల్ రానుంది. ఈ కొత్త సీరియల్ పేరు రాధకు నీవేరా ప్రాణం. ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే సోమవారం (ఏప్రిల్ 24) నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు ఛానెల్ మంగళవారం (ఏప్రిల్ 18) అనౌన్స్ చేసింది.

ఈ కొత్త సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అవనుంది. నిజానికి ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను చాలా రోజుల కిందటే ఆ ఛానెల్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో రిలీజ్ చేసింది. ఈ సీరియల్ రాధిక అనే స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. తాను వేసిన ఆర్ట్ ల ద్వారా సంపాదిస్తూ హాయిగా సాగిపోతున్న ఆమె జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.

మరోవైపు ఈ సీరియల్ లో హీరో కార్తీక్ కృష్ణ అనే పోలీస్ ఆఫీసర్. రాధిక జీవితంలోని విషాద ఘటన ద్వారా కార్తీక్ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. విధి ఈ ఇద్దరినీ కలుపుతుంది. క్రిమినల్ కేసులను పరిష్కరించడంలో తన స్కెచ్ ల ద్వారా కార్తీక్ కు సాయం చేస్తుంది రాధిక. ప్రేమ, విధి రాతలోని సంక్లిష్టతలను చూపుతూ ఈ రాధకు నీవేరా ప్రాణం సీరియల్ సాగిపోతుంది.

వీళ్లు కలిసే ఉంటారా? వీళ్ల మధ్య ప్రేమ ఫలిస్తుందా? లేక అనుకోని ట్విస్ట్ ఏదైనా వీళ్ల మధ్య దూరం పెంచుతుందా అన్నది ఈ సీరియల్ లోనే చూడాలి. ఈ రాధకు నీవేరా ప్రాణం సీరియల్ లో రాధిక పాత్రలో చైత్ర రాయ్, కార్తీక్ పాత్రలో నిరుపమ్ పరిటాల నటించారు. తెలుగు టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నిరుపమ్ ఈ కొత్త సీరియల్లోనూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం