Tiger 3 : ముగిసిన టైగర్ 3 షూటింగ్.. దీపావళిపై సల్మాన్ ఫోకస్
Salman Khan : 'టైగర్' సిరీస్ చిత్రాలపై అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో 'టైగర్ 3' సినిమా కూడా ఉంది.
గెలుపు ఓటములు ఎదురైనా సల్మాన్ ఖాన్(Salman Khan) డిమాండ్ తగ్గలేదు. ఇప్పుడు టైగర్ 3 సినిమాపై దృష్టి పెట్టాడు కండల వీరుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ ధృవీకరించారు. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇందులో సల్మాన్ ఖాన్తో పాటు కత్రినా కైఫ్(Katrina Kaif), ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సల్మాన్ కొన్ని విషయాలను పంచుకున్నారు. నిన్న రాత్రి టైగర్ 3 షూటింగ్లో పాల్గొన్నాను. దాని షూటింగ్ పూర్తి చేశాను. చాలా కష్టమైంది. అయినా బాగానే ఉందని చెప్పుకొచ్చాడు. దీపావళి పండుగ(Diwali Festival)లోపు ఈ సినిమా చూస్తారు అని సల్మాన్ ఖాన్ తెలిపాడు.
పండుగల సమయంలో సినిమాలు విడుదలై మంచి వసూళ్లు రాబడుతాయి. కాబట్టి, సల్మాన్ ఖాన్ 2023 దీపావళి పండుగకు సినిమా విడుదల చేసేందుకు చూస్తున్నాడు. 'టైగర్' సిరీస్ చిత్రాలపై అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో 'టైగర్ 3'(Tiger 3) సినిమా ఉంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఇటీవల విడుదలైన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో తదుపరి సినిమాల ద్వారా విజయం సాధించాలని సల్మాన్ అనుకుంటున్నాడు.
టైగర్ 3లో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.35 కోట్లు వెచ్చించారట. ఓ భారీ సెట్ను రూపొందించారు. జైల్ హౌస్ సీక్వెన్స్ కోసం ఈ సెట్ను నిర్మించారని తెలుస్తోంది. సల్మాన్-షారుఖ్(Salman Shah Rukh) ఇద్దరూ ఇందులో భాగమయ్యారు. షారుఖ్-సల్మాన్ ఒకే చిత్రంలో నటిస్తుండటంతో విపరీతంగా బజ్ ఏర్పడుతుందని, వారి స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొని అదిరిపోయే సీక్వెన్స్ తెరకెక్కించారు.
సల్మాన్ ఖాన్ కు సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా డిమాండ్ ఉంది. బిగ్ బాస్(Bigg Boss) షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు OTTలోకి కూడా అడుగుపెడుతున్నాడు. 'బిగ్ బాస్ OTT సీజన్ 2' త్వరలో ప్రారంభం కానుంది. మొదటి సీజన్కు కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరించారు. ఇప్పుడు అతని స్థానంలో సల్మాన్ ఖాన్ వస్తున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.