AP Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…-severe hailstorm in 47 mandals in ap today hailstorm warning in 143 mandals ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…

AP Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…

Sarath chandra.B HT Telugu
Apr 24, 2024 05:00 AM IST

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 44కుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో మండిపోతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్
ఏపీలో మండిపోతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్

AP Weather Updates: రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు ‌High Temparatures కొనసాగుతున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1°C, విజయనగరం జిల్లా జామిలో 44.9°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.6°C, కర్నూలు జిల్లా వగరూరులో 44.2°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1°డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.8°డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోట, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 43.7°డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తలు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు Severe Heat Waves, 143 మండలాల్లో వడగాల్పులు heat Waves వీచే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 109 వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ SDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

బుధవారం తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(46) :

శ్రీకాకుళంలో 13 మండలాలు , విజయనగరంలో 19 మండలాలు , పార్వతీపురం మన్యంలో 11 మండలాలు , అనకాపల్లిలో 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.శ్రీకాకుళంలో 16 మండలాలు , విజయ నగరంలో 6 మండలాలు, పార్వతీపురం మన్యం లో 4 మండలాలు, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 9 మండలాలు, విశాఖపట్నంలో 3 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

అనకాపల్లి 15, కాకినాడ 18, కోనసీమ 9, తూర్పుగోదావరి 19, పశ్చిమగోదావరి 4, ఏలూరు 12, కృష్ణా 6, ఎన్టీఆర్ 5, గుంటూరు 13, పల్నాడు 2, బాపట్ల 1, తిరుపతి జిల్లా గూడూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో అధిక ఉష‌్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం