Budget Allocation To SCR Zone: రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు..తెలంగాణకు 4,418, ఏపీకి రూ. 8,406 కోట్లు -scr zone gets the record budgetary allocation for telugu states jurisdiction ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Budget Allocation To Scr Zone: రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు..తెలంగాణకు 4,418, ఏపీకి రూ. 8,406 కోట్లు

Budget Allocation To SCR Zone: రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు..తెలంగాణకు 4,418, ఏపీకి రూ. 8,406 కోట్లు

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 11:03 PM IST

Union Budget 2023 Updates: బడ్జెట్ లో ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ ల కోసం రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. బడ్జెట్ లోని కేటాయింపులకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపారు. గతేడాదిలో ఇచ్చిన వివరాలను కూడా పేర్కొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న దక్షిణ మధ్య రైల్వే  జీఎం అరుణ్ కుమార్ జైన్
వివరాలు వెల్లడిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ (twitter)

Budget Allocation To South Central Railway Zone 2023: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్ట్ లకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2023-2024 సంవత్సరానికి గాను దక్షిణ మధ్య రైల్వే కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా.. శుక్రవారం (ఫిబ్రవరి 3) సమగ్ర వివరాలతో కూడిన పింక్ బుక్ ను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రైల్వే ప్రాజెక్టుల కోసం తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన వివరాలను జీఎం క్లుప్తంగా పేర్కొన్నారు.

దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు:

దక్షిణ మధ్య రైల్వేకు అధిక మొత్తంలో 2023-24 సంవత్సరానికి రూ. 13,786.19 కోట్లు కేటాయించారు. ఇది 2022-23 సంవత్సరానికి 8,349.75 కోట్లుగా ఉంది. ఇది గతేడాదితో పోల్చితే దాదాపు 65% అధికం.

• డబ్లింగ్, మూడవ లైన్ మరియు బైపాస్ లైన్ పనుల కోసం మూలధన కేటాయింపు ల మొత్తం రూ. 3,374.44 కోట్లు. గత సంవత్సరం కేటాయింపు రూ. 1,531 కోట్లుగా ఉంది.

• కొత్త లైన్ల కోసం, క్యాపిటల్ మరియు సేఫ్టీ ఫండ్ (డిపాజిట్ మినహా)తో సహా మొత్తం బడ్జెట్ గ్రాంట్ రూ. 819 కోట్లు, గత సంవత్సరం రూ. 285 కోట్లు.

• విద్యుదీకరణ పనుల కోసం, బడ్జెట్ గ్రాంట్ రూ. 588 కోట్లు.

•రోడ్డు భద్రత పనులకు (లెవల్ క్రాసింగ్‌లు, వంతెనలు మరియు ఆర్ ఓ బి /ఆర్ యూ బి ) లకు 768.14 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంలో కేటాయించినవి రూ. 758 కోట్లు.

•ట్రాక్ పునరుద్ధరణ పనులకు రూ. 1,360 కోట్లు, అంతకు ముందు సంవత్సరంలో రూ. 1,040 కోట్లు కేటాయించారు.

•కవచ్ అభివృద్ధి కోసం రూ. 68.34 కోట్లు కేటాయించబడింది. ఇందులో భాగంగా వాడి-రేణిగుంట, దువ్వాడ-విజయవాడ, బల్హర్షా-విజయవాడ-గూడూరు, మన్మాడ్- పర్భాని- నాందేడ్- సికింద్రాబాద్- గద్వాల్- ధోనేగుంతకల్, బీదర్-పర్లి వైజనాథ్-పర్భాని మరియు వాడి-గుంతకల్ విభాగాల్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది.

•మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుకు రూ. 345 కోట్లు కేటాయించారు.

•నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 202 కోట్లు కేటాయింపు.

•మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 185 కోట్లు కేటాయింపు.

•కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయింపు.

•బీదర్ - నాందేడ్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయింపు.

•భద్రాచలం - కొవ్వూరు కొత్త లైన్‌ ప్రాజెక్టుకు రూ. 20 కోట్లు కేటాయింపు.

•మణుగూరు-రామగుండం కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 10 కోట్లు కేటాయింపు.

•ఎంఎంటీఎస్ రెండవ దశ ప్రాజెక్ట్ కోసం రూ. 600 కోట్లు కేటాయింపు (2012 -2013 సంవత్సరానికి గాను మంజూరైన నిధులు రూ. 817 కోట్లు. ఇప్పటి వరకు పూర్తయిన విభాగాలు - మల్కాజిగిరి - బోలారం 14 కి.మీ మేర డబుల్ లైన్ విద్యుదీకరణ , తేలాపూర్ - రాంచంద్రపురం 6 కి.మీ, మేడ్చల్-బోలారం డబ్లింగ్ 14 కి.మీ, మౌలాలీ - ఘట్‌కేసర్ మధ్య 12.2 కి.మీ., ఫలక్‌నుమా-ఉందనగర్ మధ్య 1.5 కి.మీ. ప్రస్తుతం, సనత్ నగర్ నుంచి మౌలాలీ వరకు విద్యుదీకరణతో డబ్లింగ్ మరియు మౌలా అలీ - మల్కాజిగిరి - సీతాఫల్ మండి వరకు విద్యుదీకరణతో డబ్లింగ్ తో పాటు మరియు మరో రెండు విభాగాలలో పనులు జరుగుతున్నాయి.)

•విజయవాడ-గూడూరు మధ్య 3వ లైన్ ప్రాజెక్టుకు రూ. 800 కోట్లు కేటాయింపు.

•గుంటూరు-గుంతకల్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ. 980 కోట్లు కేటాయింపు.

•కాజీపేట-విజయవాడ 3వ లైన్ ప్రాజెక్టుకు రూ.337.52 కోట్లు కేటాయింపు.

•కాజీపేట-బల్హర్షా 3వ లైన్ ప్రాజెక్ట్ (రాఘవపురం-మందమర్రి మినహా) కోసం రూ. 450.86 కోట్లు కేటాయింపు

•గుత్తి -ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 90.6 కోట్లు కేటాయింపు.

•విజయవాడ-గుడివాడ/మచిలీపట్నం-భీమవరం/నర్సాపూర్-నిడదవోలు డబ్లింగ్, విద్యుద్దీకరణకు రూ. 100 కోట్లు కేటాయింపు.

•ధర్మవరం-పాకాల-కాట్పాడి డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ. 40 కోట్లు కేటాయింపు.

•గుంటూరు-బీబీనగర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ. 60 కోట్లు కేటాయించారు.

•ముద్ఖేడ్ మరియు సికింద్రాబాద్ మీదుగా అకోలా-ధోన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.60 కోట్లు కేటాయించారు.

•బై పాస్ లైన్ల నిర్మాణం కోసం రూ. 383.12 కోట్లు కేటాయింపు.

•మన్మాడ్ - ముద్ఖేడ్ - డోన్ విభాగానికి కేటాయించిన నిధులు రూ. 315.6 కోట్లు

•పింపాల్‌కుతి - ముధ్‌కేడ్ మరియు పర్భాని- పర్లి వైజనాథ్ సెక్షన్‌ల విద్యుద్దీకరణకు 132.33 కోట్లు కేటాయింపు.

•పూర్ణ -అకోలా మధ్య విద్యుదీకరణ కోసం కేటయించిన నిధులు రూ. 35 కోట్లు .

•పగిడిపల్లి -నల్లపాడు (285 రూట్ కి .మీ ) మధ్య విద్యుదీకరణ కోసం రూ . 32 .8 కోట్లు కేటాయింపు.

ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు :

•పెద్ద ఎత్తున్న స్టేషన్లపునరాభివృద్ది చేసేందుకు (అంబ్రెల్లా వర్క్స్) కోసం రూ 555 కోట్లు మంజూరు

•స్టేషన్ ల అభివృద్ధి పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే కు 215 కోట్లు మంజూరg

•ట్రాఫిక్‌ సౌకర్యాల పనులకు రూ. 204 కోట్లు మంజూరయ్యాయి.

•కాజీపేటలో పీఓహెచ్ వర్క్‌షాప్ కోసం రూ. 160 కోట్లు కేటాయింపు.

•స్వర్ణ చతుర్భుజ మార్గాలలో ఆర్ ఓ బి / ఆర్ యూ బి నిర్మాణానికి 200 కోట్లు మంజూర .

•చర్లపల్లి స్టేషన్‌లోని శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి రూ. 82 కోట్లు కేటాయింపు

•కర్నూలులో మిడ్‌లైఫ్ పునరావాస ఫ్యాక్టరీకి రూ.125 కోట్లు కేటాయింపు.

•తిరుచానూరు రైల్వే స్టేషన్‌ అభివృద్ధిక కోసం రూ. 8.5 కోట్లు కేటాయించారు.

•స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు మరియు అధిక స్థాయి ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు కోసం రూ .53.43 కోట్లు కేటాయించబడ్డాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే..

2023-24లో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు భద్రతా పనుల కోసం మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ. 4,418 కోట్లు కాగా, 2022-23లో రూ. 3,048 కోట్లుగా ఉంది. ఇది 45 శాతం అధికం . ఇటీవలి కాలంలో వరుస బడ్జెట్‌లలో తెలంగాణకు నిధుల కేటాయింపులో స్థిరమైన పెరుగుదల ఉంది.

2023-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు భద్రతా పనుల కోసం మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ. 8,406 కోట్లు కాగా, 2022-23లో రూ. 7,032 కోట్లు, ఇది 20% అధికం . 2009-14లో జరిగిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు 9.5 రెట్లు అధికంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్ కేటాయింపులు కూడా నిరంతరాయంగా పెరుగుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం