JEE Main 2023 Result : నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​..-jee main result 2023 session 2 registration begins today check full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main Result 2023 Session 2 Registration Begins Today Check Full Details

JEE Main 2023 Result : నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​..

Sharath Chitturi HT Telugu
Feb 07, 2023 10:31 AM IST

JEE Main 2023 Result : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలను వెల్లడించిన ఎన్​టీ.. సెషన్​ 2కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియను మంగళవారం ప్రారంభించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్
నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్

JEE Main 2023 session 2 registration : జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) మంగళవారం ప్రారంభించనుంది. jeemain.nta.nic.in లో జేఈఈ మెయిన్స్​ అప్లికేషన్​ ఫామ్​ను అభ్యర్థులు సమర్పించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

నెల రోజుల పాటు..

ఫిబ్రవరి 7న ప్రారంభంకానున్న జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ.. మార్చ్​ 7 వరకు కొనసాగనుంది. అంటే.. రిజిస్ట్రేషన్​ కోసం అభ్యర్థులకు నెల రోజుల సమయం ఉంది. మార్చ్​ చివరి వారంలో పరీక్షకు సంబంధించిన అడ్మిట్​ కార్ట్​ను విడుదల చేస్తుంది ఏన్​టీఏ.

JEE Main 2023 session 2 registration details : ఏప్రిల్​ 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 2 పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు రెండుసార్లు అవకాశాన్ని ఇచ్చేందుకు ప్రతియేటా రెండుసార్లు జేఈఈ మెయిన్​ పరీక్షను నిర్వహిస్తోంది ఎన్​టీఏ. అభ్యర్థులు సెషన్​ 1, లేదా సెషన్​ 2లో పరీక్షకు హాజరవచ్చు. రెండింట్లోనూ హాజరయ్యే వెసులుబాటు కూడా ఉంది. రెండిట్లో పరీక్ష రాస్తే.. టాప్​ స్కోర్​ని పరిగణిస్తారు. రెండు సెషన్స్​కి సంబంధించి ఫలితాలు వెలువడిన తర్వాత.. జేఈఈ మెయిన్​ ర్యాంకింగ్స్​ను ప్రకటిస్తుంది ఎన్​టీఏ.

జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు..

JEE Main 2023 Session 1 results declared- జేఈఈ మెయిన్​ సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 మధ్య జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్​ సెషన్ 1 పరీక్షలు జరిగాయి. జనవరి సెషన్‍లో పేపర్-1 (బీటెక్​/బీఈ) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్-2 (బీఆర్క్​/బీప్లానింగ్​)కు 46వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. 95.79శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యాయని ఎన్‍టీఏ వెల్లడించింది. ఈ జేఈఈ 2023 సెషన్ -1 పరీక్ష ఫలితాలను ఇప్పడు విడుదల చేసింది. జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మొత్తం మీద.. ఇంగ్లీష్​, హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్​, తెలుగు భాషల్లో ఈ జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​ జరుగుతుంది.

JEE Main 2023 session 2 news : దేశంలోని ప్రముఖ ఎన్​ఐటీ, ఐఐటీ, సీఎఫ్​టీలలో ప్రవేశల కోసం ఈ జేఈఈ మెయిన్​ పరీక్షను నిర్వహిస్తారు. ఆల్​ ఇండియా ర్యాంకింగ్స్​ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం