5G smartphone : మీ స్మార్ట్ఫోన్.. '5జీ'కి సపోర్ట్ చేస్తుందా? ఇలా చెక్ చేసుకోండి..
5G smartphone : మీ స్మార్ట్ ఫోన్కి 5జీ సపోర్ట్ ఉందా? లేదాా కొత్తది కొనుగోలు చేసుకోవాలా? ఇలా చెక్ చేసుకోండి..
5G smartphone : ఇప్పుడు దేశమంతా 5జీ కోసం ఎదురుచూస్తోంది! అందుకు తగ్గట్టుగానే.. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను తీసుకొచ్చేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో.. బిడ్డింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. అంతా బానే ఉంది కానీ.. మన స్మార్ట్ఫోన్.. 5జీకి సపోర్ట్ చేస్తుందా? లేదా కొత్తది తీసుకోవాలా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కొత్తది తీసుకునేముందు.. ఒకసారి ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ఫోన్లో 5జీ సపోర్టు ఉందా, లేదా అన్న తెలుసుకోవడం ఉత్తమం.
మీ స్మార్ట్ఫోన్.. 5జీకి సపోర్ట్ చేస్తుందా?
- ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ముందుగా సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- స్టెప్ 1 :- 'వైఫై అండ్ నెట్వర్క్' ఆప్షన్ను ఎంచుకోండి.
- స్టెప్ 2 :- 'సిమ్ అండ్ నెట్వర్క్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- స్టెప్ 3 :- 'ప్రిఫర్డ్ నెట్వర్క్'లో.. అన్ని టెక్నాలజీలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
- స్టెప్ 4 :- మీ స్మార్ట్ఫోన్కి 5జీ సపోర్టు ఉంటే.. అందులో 2G/3G/4G/5G అని కనిపిస్తుంది.
యాపిల్ ఐఫోన్లో ఇలా..
5g settings iPhone : యాపిల్ ఐఫోన్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.
- సెల్యులర్/ మొబైల్ డేటా మీద క్లిక్ చేయండి.
- స్క్రీన్ మీద.. డేటా రోమింగ్, వాయిస్ అండ్ డేటా, డేటా మోడ్ వంటి ఆఫ్షన్లు కనిపిస్తుంటే.. మీ యాపిల్ ఫోన్లో 5జీ సేవలు వస్తాయి.
భారతీయుల ఎదురుచూపులు..
89శాతం మంది భారతీయులు.. 5జీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. వారందరు 5జీకి అప్డేట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది.
నెట్వర్క ఇంటెలిజెన్స్ సంస్థ ఓక్లా.. ఈ సర్వే చేపట్టింది. 4జీ కన్నా.. 5జీ 10రెట్లు వేగంగా కనెక్టివిటీని అందించినా.. ధరలు, కవరేజీ, వినియోగం వంటివి తొలి దశలో సవాళ్లుగా మారతాయని అభిప్రాయపడింది.
5G in India : "5జీ ధరలు ఎక్కువగా ఉంటే ప్రజలు వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. సర్వేలో పాల్గొని, 5జీకి అప్డేట్ అవ్వము అని చెప్పివారిలో 25శాతం మంది.. ధరల గురించే ఆలోచిస్తున్నట్టు తెలిపారు. మరో 24శాతం మంది 5జీపై అవగాహన లేకపోవడంతో అప్డేట్ అవ్వము అని అన్నారు. ఇక 23శాతం మంది.. తమ వద్ద 5జీ ఫోన్ లేని కారణంగా అప్డేట్ అవ్వమని తేల్చారు," అని ఓక్లా సర్వే స్పష్టం చేసింది.
ఏదేమైనప్పటికీ.. 89శాతం మంది భారతీయులు 5జీ పట్ల కుతుహలంగా ఉన్నారు. వారిలో 70శాతమంది.. వీడియో స్ట్రీమింగ్ వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు. 68శాతం మంది.. మొబైల్ గేమింగ్లో వేగం పెరుగుతుందని 5జీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు వివరించారు.
సంబంధిత కథనం