మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల ప్రాముఖ్యం పెరిగింది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ.. ఇప్పుడు మిల్లెట్స్ను తినడం ప్రారంభించారు. వీటిలో పోషకాలు ఎక్కువ ఉండడంతో డాక్టర్లు కూడా వీటిని తినమని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ ఆహారాన్ని మిల్లెట్స్తో భర్తీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేతి మిల్లెట్స్ పరాఠాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పహారంతో ప్రారంభిస్తే.. డే కూడా మంచిగా స్టార్ట్ అవుతుంది.
మిల్లెట్స్ మేతి పరాఠాలో ఫ్లేవనాయిడ్లు, లిగ్నిన్, ఫైటో న్యూటియెంట్లు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది యాంటీ ఏజినింగ్లా పనిచేసి.. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక ఆస్తమా రోగులకు బాజ్రాపై నోషింగ్ తప్పనిసరి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నీషియం యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఎముకలు బలంగా మారేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. దీని ప్రయోజనాలు తెలుసుకున్నారు కాబట్టి.. వీటిని మీరు కూడా రెగ్యూలర్ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోండి.
మిల్లెట్స్ - కప్
శెనగపిండి - కప్
టీస్పూన్ - జీలకర్ర
టీస్పూన్ - ఉప్పు
⅛ టీస్పూన్ - ఇంగువ
టీస్పూన్ - పసుపు
1 టీస్పూన్ - కారప్పొడి
1 టేబుల్ స్పూన్ - నువ్వులు గింజలు
కప్పు - మెంతి ఆకులు
1 టీస్పూన్ - నూనె
1 కప్పు- మెంతి ఆకులు (ఉడికించినవి)
ఒక గిన్నెలో, బేసన్, మిల్లెట్స్, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరప్పొడి, ఇంగువ, నువ్వులు, నూనె, మెంతి ఆకులు అన్ని పదార్థాలను కలపండి. పిండిని తయారు చేయడానికి కొద్దిగా వేడి నీటిని జోడించండి. మీకు 1/2 కప్పు నీరు అవసరం ఉంటుంది. ఈ ముద్దను గంటపాటు పక్కకు పెట్టేయండి.
అనంతరం పిండిని సమాన భాగాలుగా విభజించి.. వంట నూనెను ఉపయోగించి మీ అరచేతులతో రోల్ చేయండి. పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేయండి. పరాటాను వృత్తాకారంలో చుట్టండి. రోల్ చేసిన తర్వాత, మేతి మిల్లెట్స్ పరాఠాను పెనం మీద వేసి.. బంగారు రంగులోకి వచ్చే వరకు ఉంచి వేయించాలి. పెరుగు రైతా లేదా పుదీనా కొత్తిమీర చట్నీతో దీన్ని తినండి.