Zee Telugu Contest: జీ తెలుగులో ఆ రెండు సీరియల్స్ చూడండి.. ఆ స్టార్లను కలవండి
Zee Telugu Contest: జీ తెలుగులో ఆ రెండు సీరియల్స్ చూడండి.. ఆ స్టార్లను కలవండి అంటూ ఈ ఛానెల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. మదర్స్ డే సందర్భంగా ఐదు రోజుల పాటు ఈ కాంటెస్ట్ ఉండనుంది.
Zee Telugu Contest: తెలుగులోని టాప్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు తమ ప్రేక్షకుల కోసం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఐదు రోజుల పాటు రెండు సీరియల్స్ టెలికాస్ట్ అయ్యే సమయంలో ఈ కాంటెస్ట్ ఉంటుంది. ఈ మధ్యే జీ తెలుగులో వచ్చిన పాపులర్ షోలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ గురించి ఈ పోటీ ఉంటుంది.
మదర్స్ డే సందర్భంగా జీ తెలుగు ఈ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మంగళవారం (మే 9) నుంచి శనివారం (మే 13) వరకూ ఐదు రోజుల పాటు ఈ కాంటెస్ట్ ఉంటుంది. ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ రెండు సీరియల్స్ టెలికాస్ట్ అయ్యే సమయంలో పోటీలో పాల్గొని గెలిచే వాళ్లకు వాళ్ల ఫేవరెట్ స్టార్లను కలిసే అవకాశం కల్పిస్తోంది.
ఈ ఐదు రోజుల్లో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ టెలికాస్ట్ అయ్యే సమయంలో ఆసక్తి ఉన్న ప్రేక్షకులు +91-9966034441 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు అడిగే ఓ సులువైన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. అలా చెప్పిన వాళ్లలో లక్కీ విన్నర్స్ కు నిరుపమ్ పరిటాల, రఘులను కలిసే అవకాశం ఉంటుంది.
మదర్స్ డే అయిన వచ్చే ఆదివారం (మే 14) ఈ ఇద్దరు హీరోలను కలిసే ఛాన్స్ జీ తెలుగు ఛానెల్ ఇవ్వనుంది. ఇక ఈ ఐదు రోజుల పాటు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ స్పెషల్ ఎపిసోడ్లు కూడా ఉంటాయి. వీటిలో ప్రేక్షకులు ఊహించని కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు కూడా ఉంటాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిలో లక్ష్మీ తన అత్తమామల వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతోంది.
ఇక రాధకు నీవేరా ప్రాణంలో సీరియల్ లో రాధ ప్రమాదంలో పడుతుంది. కొందరు దుండగులు ఆమె వెంటాడుతుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ సీరియల్ లో రాబోయే స్పెషల్ ఎపిసోడ్స్ లో చూడాలి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు, రాధకు నీవేరా ప్రాణం రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అవుతాయి.
సంబంధిత కథనం