Rumours on Samantha: సమంతాపై వస్తున్న ఊహాగనాలకు బ్రేక్.. ఖండించిన సామ్ టీమ్.. అసలు నిజం ఏంటంటే?
Rumours on Samantha: సమంత గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతుందని వార్తలు వస్తున్నాయి. వీటిపై సామ్ మేనేజర్ మహేంద్ర స్పందించారు.
Samanatha Team clarity on Her Health Condition Rumours: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఇంటర్నెట్లో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇలా సైలెంట్ అవ్వడంతో అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. ఫలితంగా సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు రావడం మొదలైంది. సామ్ అనారోగ్య కారణాలతో బాధపడుతందని, ఆమెకు అరుదైన చర్మ వ్యాధి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై సామ్ కూడా ప్రతిస్పందించకపోవడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. తాజాగా ఈ విషయంపై సమంత మేనేజర్ మహేంద్ర స్పందించారు. ఆమెపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు.
సమంత తన అనారోగ్యంపై చికిత్స తీసుకోవడం కోసం అమెరికా వెళ్తుందని సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త హల్చల్ చేసింది. దీనిపై మహేంద్ర మాట్లాడుతూ.. సామ్పై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా అనారోగ్యంపై వస్తున్న వార్తలపైనా స్పందించారు. తను బాగానే ఉందని, ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని, దయచేసి వాటిని నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి అమెరికా పర్యటనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే సామ్ ఈ యూఎస్ ట్రిప్ వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలియజేయలేదు.
సినిమాల విషయానికొస్తే సామ్ చివరిగా తమిళంలో విజయ్ సేతుపతి సరసన.. కథువాకల రెండు కాదల్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకుడు. ఇది కాకుండ యశోధ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె గర్భవతిగా కనిపించింది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమానూ చేస్తోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. దీనికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహానటి తర్వాత సామ్తో విజయ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
సంబంధిత కథనం