Rashmika Mandanna on Kissing Vijay: అవి బాధాకరమైర రోజులు.. ఏడుస్తూనే లేచేదాన్ని: రష్మిక
Rashmika Mandanna on Kissing Vijay: అవి బాధాకరమైర రోజులు.. ఏడుస్తూనే నిద్ర లేచేదాన్ని అని రష్మిక మందన్నా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపింది. విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్పై ఆమె ఈ కామెంట్స్ చేయడం విశేషం.
Rashmika Mandanna on Kissing Vijay: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా అఫైర్స్ రూమర్లు ఇప్పటివి కావు. ఈ జంట గీతగోవిందం మూవీలో నటించినప్పటి నుంచే ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. తమ రిలేషన్షిప్పై ఈ ఇద్దరూ ఇప్పటికే ఎన్నోసార్లు స్పందించారు. అయినా ఆ పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండతో హాట్ కిస్ సీన్లపై స్పందించింది. ఈ సీన్లు చేసినందుకు తనను విపరీతంగా ట్రోల్ చేశారు. అవి తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన రోజులు అని తాజా ఇంటర్వ్యూలో రష్మిక చెప్పింది. ఆ దశ నుంచి తాను బయటపడటం అంత సులువు కాలేదని తెలిపింది.
"అప్పట్లో చాలా బాధాకరమైన విషయాలు జరిగాయి. ఎన్నో బాధపెట్టే విషయాలను కూడా నేను చదివాను. అందరి సాయం కోసం చూస్తున్న సమయంలో వాళ్లెవరూ నన్ను పట్టించుకోవడం లేదన్నట్లుగా కలలు వచ్చేవి. అది ఏంటి? ఎందుకు అన్నది నాకు అర్థం కాలేదు. అలాంటి కలలతోనే నిద్ర లేచేదాన్ని. అలాగే బెడ్పై ఏడుస్తూ పడుకునే దాన్ని. చాలాసార్లు ఏడుస్తూనే నిద్ర లేచేదానిని" అని రష్మిక ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో స్క్రీన్పైనా హాట్ సీన్లు చేయడంతో రష్మిక, విజయ్ మధ్య ఏదో జరుగుతోందన్న పుకార్లు ఎక్కువయ్యాయి. మొదట్లో ఇలాంటివి చూసి బాధపడిన రష్మిక.. తర్వాత వీటిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు పుష్ప మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన ఆమె.. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం అక్టోబర్ 7న రానున్న గుడ్బై మూవీ ప్రమోషన్లలో రష్మిక బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె అమితాబ్ బచ్చన్, నీనా గుప్తాలతో కలిసి నటించింది. ఈ సినిమా తర్వాత మిషన్ మజ్నూ, యానిమల్లాంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇవి కాకుండా త్వరలోనే పుష్ప 2 షూటింగ్ కూడా ప్రారంభించనుంది. అటు విజయ్ దళపతి సరసన వారసుడు మూవీలోనూ రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.