NTR30 Officially Launched: ఎన్టీఆర్-కొరటాల మూవీ గ్రాండ్ లాంచ్ .. తారక్ కోసం వచ్చిన రాజమౌళి, ప్రశాంత్ నీల్
NTR30 Officially Launched: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 మూవీ అధికారికంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ వచ్చారు.
NTR30 Officially Launched: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ ఈవెంట్లతో బిజీగా ఉన్న తారక్ తన తదుపరి సినిమాను ప్రారంభించేశారు. NTR30 సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. గురువారం నాడు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ వేడుకకు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. ఈ కార్యక్రమానికి జాన్వీ కూడా విచ్చేసింది. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్-జాన్వీపై ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్ స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ చీరకట్టులో మెరిసింది.
ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.