Chiranjeevi on Virupaksha: మేనల్లుడుకు విషెస్ చెప్పిన మెగాస్టార్.. విరూపాక్ష మూవీపై చిరు ట్వీట్-megastar chiranjeevi tweets and wishes virupaksha movie team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi On Virupaksha: మేనల్లుడుకు విషెస్ చెప్పిన మెగాస్టార్.. విరూపాక్ష మూవీపై చిరు ట్వీట్

Chiranjeevi on Virupaksha: మేనల్లుడుకు విషెస్ చెప్పిన మెగాస్టార్.. విరూపాక్ష మూవీపై చిరు ట్వీట్

Maragani Govardhan HT Telugu
Apr 21, 2023 08:14 PM IST

Chiranjeevi on Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీకి పాజిటివ్ రివ్యూస్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిత్రబృందానికి ట్విటర్ వేదికగా విషెస్ తెలియజేశారు.

చిరంజీవితో సాయి ధరమ్ తేజ్
చిరంజీవితో సాయి ధరమ్ తేజ్

Chiranjeevi on Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి సర్వత్రా పాజిటివ్ టాక్ వస్తోంది. పలువురు ప్రముఖులు సైతం సాయి ధరమ్ తేజ్ సహా విరూపాక్ష బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఈ ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

"విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన రిపోర్టులు వస్తున్నాయని విన్నాను. డియర్ సాయి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చావ్. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. నీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదిరంచి, ఆశీర్వదిస్తున్నందుకు ఆనందిస్తున్నా. చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అని చిరంజీవి తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్‌కు చిరంజీవి సతీమణి కేక్ తినిపిస్తున్న ఫొటోను షేర్ చేశారు.

మెగాస్టార్ ట్వీట్ చేయడంతో సాయి ధరమ్ తేజ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. "థ్యాంక్యూ మామ, అత్తా.. మిమ్మల్ని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" అని ట్వీట్ చేశారు.

రెండున్నరేళ్ల కింద సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ వల్ల అతను 12 రోజుల పాటు కోమాలో ఉన్నారు. ప్రమాదం నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన సాయి తేజ్ అనంతరం మెగా ఫ్యామీలో అతడికి వెల్‌కమ్ చెబూత్ సెలబ్రేషన్స్ చేసుకుంది. వెల్‌కమ్ తేజ్ 2.0 అని రాసి ఉన్న కేకును కట్ చేయించి విషెస్ చెప్పింది. ఆ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఇప్పుడు చిరంజీవి తన ట్విటర్‌లో షేర్ చేస్తూ విరూపాక్ష టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందించారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

IPL_Entry_Point

టాపిక్