Gold Silver Rate Today: గుడ్ న్యూస్… భారీగా తగ్గిన బంగారం ధర - నేటి లెక్కలివే
Today Gold and Silver Price: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధరలు తగ్గగా... ఇవాళ భారీగా దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,160గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు కూడా తగ్గింది.
Gold silver price today 12 october 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. ఇక మంగళవారం కాస్త ధరలు తగ్గగా... ఇవాళ మాత్రం భారీగానే దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 తగ్గగా... 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 700 దిగివచ్చింది.
ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,160గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,900 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండిపై రూ. 600 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.64,000గా ఉంది
Gold silver price today: ఏపీలో ఇలా…
gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,160గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 64,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.
Gold silver price: పలు నగరాల్లో ఇలా..
gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,050గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,330 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,160గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,900 వద్ద కొనసాగుతోంది.
Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..
ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 340 చొప్పున పెరిగింది. హైదరాబాద్లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,000గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,000గా ఉంది.
ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.