Bhuma Akhila Priya : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు-nandyal tdp leader bhuma akhila priya got bail in av subbareddy attack case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nandyal Tdp Leader Bhuma Akhila Priya Got Bail In Av Subbareddy Attack Case

Bhuma Akhila Priya : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

Bandaru Satyaprasad HT Telugu
May 24, 2023 04:36 PM IST

Bhuma Akhila Priya : నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమ అఖిల ప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సాయంత్రం ఆమె కర్నూలు జైలు నుంచి విడుదల కానున్నారు.

భూమా అఖిల ప్రియ
భూమా అఖిల ప్రియ (Image Credit : Akhila Priya Instagram)

Bhuma Akhila Priya : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో ఇటీవల మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు. ఆమెకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఆమెకు బెయిల్‌ మంజూరైంది. బుధవారం సాయంత్రం అఖిల ప్రియ కర్నూలు జైలు నుంచి విడుదల కానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగింది?

ఈ నెల 17న నంద్యాలలో నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులపై పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని నంద్యాల కోర్టులో ప్రొడ్యూస్ చేయగా... కోర్టు భూమా అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో అఖిల ప్రియ దంపతులను పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 17న కొత్తపల్లి వద్ద టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిలప్రియ దంపతులను పాణ్యం పోలీసులు అరెస్టు చేశారు.

నంద్యాల ఆధిపత్య పోరు

నంద్యాల జిల్లాలో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితులు. అయితే భూమా నాగిరెడ్డి మరణం అనంతరం ఆ కుటుంబానికి దూరం జరిగారు ఏవీ సుబ్బారెడ్డి. దీంతో నంద్యాలలో రాజకీయాలు మారిపోయాయి. లోకేశ్ పాదయాత్రలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఒక్కరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. ఈ ఇష్యూపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ పరంగా ఓ కమిటీ వేసి, ఘనటపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారైనైనా ఉపేక్షించమని హెచ్చరించారు.

అఖిలప్రియపై జస్వంతి రెడ్డి ఫైర్

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనపై ఆమె కుమార్తె జస్వంతి రెడ్డి ఇటీవల స్పందించారు. తన తండ్రికి ఎలాంటి గాయాలు కాలేదని, ఈ ఘటనలో షర్ట్ మాత్రమే చిరిగిందన్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియపై జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భూమా నాగిరెడ్డి తాను, ఏవీ సుబ్బారెడ్డి వేరు కాదని చాలాసార్లు చెప్పారన్నారు. తండ్రి లాంటి వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని జస్వంతి రెడ్డి ఆవేదన చెందారు. చిన్నప్పటి నుంచి అఖిలప్రియను ఎత్తుకుని పెంచిన వ్యక్తిపై దారుణమైన ఆరోపణ చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అఖిలప్రియ తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయించారని మండిపడ్డారు.

IPL_Entry_Point