Harithotsavam : తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనమేనన్న సీఎం కేసీఆర్, 9వ విడత హరితహారం ప్రారంభం
- Harithotsavam : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హరితోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో మొక్కల్ని నాటారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం స్వాగతం పలుకుతోందని సీఎం అన్నారు.
- Harithotsavam : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హరితోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో మొక్కల్ని నాటారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం స్వాగతం పలుకుతోందని సీఎం అన్నారు.
(1 / 9)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘హరితోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
(2 / 9)
తెలంగాణకు హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
(3 / 9)
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్క నాటి తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
(5 / 9)
అంతకు ముందు సఫారీ వాహనంలో పార్కును పరిశీలించారు సీఎం కేసీఆర్. ఫొటో ఎగ్జిబిషన్, అటవీ అధికారుల సామాగ్రిని కేసీఆర్ తిలకించారు.
(6 / 9)
తెలంగాణకు హరితహారం 9వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం కేసీఆర్ అన్నారు.
(8 / 9)
ఎమిదేండ్లలో 273.33 కోట్ల మొక్కలు చెట్లు నాటినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచిందన్నారు. హరితహారానికి ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది.
ఇతర గ్యాలరీలు