Suryapet Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం… పుట్టు వెంట్రుకలు తీయించేందుకు విజయవాడ వెళుతూ…-six killed two injured in suryapet road accident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం… పుట్టు వెంట్రుకలు తీయించేందుకు విజయవాడ వెళుతూ…

Suryapet Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం… పుట్టు వెంట్రుకలు తీయించేందుకు విజయవాడ వెళుతూ…

Sarath chandra.B HT Telugu
Apr 25, 2024 06:38 AM IST

Suryapet Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ఓ కుటుంబం విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కాలిపోతున్న లారీ, కారు
ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కాలిపోతున్న లారీ, కారు

Suryapet Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు Fatal accident ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారు, జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్నSix killed ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై లారీ బ్రేక్ డౌన్ break down కావడంతో దానిని డ్రైవర్‌ రోడ్డుపైనే నిలిపి ఉంచాడు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న ఎక్స్‌ఎల్‌ 6 వాహనంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలో పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మాణిక్యమ్మ, చంద్రరావు , స్వర్ణ, శ్రీకాంత్, లాస్య ఉన్నారు. వీరంతా బోనకల్లు మండలం ఎల్‌ గోవిందాపురంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో పదిమంది ఉన్నారు. 

వరుస ప్రమాదాలు…

రెండు రోజుల క్రితం సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త జంట ప్రాణాలు కోల్పోయింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద.. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టడంతో New Couple భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు.

ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్‌రాజా (29), ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవి (27)లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. నవీన్‌ రాజా విజయవాడ గూడవల్లిలోని ప్రైవేటు కాలేజీలో ఫిజిక్స్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నా. భార్గవి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. గత శనివారం భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు.

శని, ఆదివారాలు తల్లిదండ్రులతో గడిపిన దంపతులు గత సోమవారం ఉదయం 6 గంటలకు కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలు దేరారు. నవీన్ పక్కసీట్లో భార్గవి కూర్చున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోలుబంకు వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని.. వీరి కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు. మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది.

మృత్యు శకటాలుగా వాహనాలు…

జాతీయ రహదారులపై రాత్రిపూట భారీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఉంచడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే కంటెయినర్‌ లారీని నిలిపి ఉంచడంతో దానిని గుర్తించ పోవడంతో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల వ్యవధిలోనే సూర్యాపేట జిల్లాలో రెండు భారీ ప్రమాదాలు జరిగాయి.

ఔటర్‌పై లారీ దగ్ధం….

హైదరాబాద్‌ ఔటర్‌ Outer Ring Road రింగ్‌ రోడ్డుపై పెద ముత్తంగి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారు, లారీ దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఔటర్‌పై లారీని నిలిపి ఉంచిన డ్రైవర్‌ పక్కకు వెళ్లడంతో వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. లారీకి రోడ్డు మార్జిన్ గడ్డర్లకు మధ్య ఉంచిన స్థలంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో లారీ, కారు రెండు కాలిపోయాయి. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం