IRCTC MP Tour From Hyd: కళ్లకు కట్టే ఖజురహో అందాలు… ఈ టూర్ ప్యాకేజీ చూడండి…-irctc tourism announced madhya pradesh tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Madhya Pradesh Tour Package From Hyderabad

IRCTC MP Tour From Hyd: కళ్లకు కట్టే ఖజురహో అందాలు… ఈ టూర్ ప్యాకేజీ చూడండి…

HT Telugu Desk HT Telugu
Nov 05, 2022 09:31 PM IST

Hyd - Madhya pradesh IRCTC Tour: హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ - మధ్యప్రదేశ్ టూర్
హైదరాబాద్ - మధ్యప్రదేశ్ టూర్ (www.irctctourism.com)

irctc tourism madhya pradesh tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'HERITAGE OF MADHYA PRADESH ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో గ్వాలియర్, ఖజురహో, ఓర్చా వంటి ప్రాంతాలను సందర్శిస్తారు.

hyderabad madhya pradesh tour: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నవంబర్ 11వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు.

Day 1- Friday: సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 2- Saturday: మధ్యాహ్నం 01.30 గంటలకు గ్వాలియర్ కు చేరుకుంటారు. యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం హెటల్ లోకి చెకిన్ అవుతారు. రాత్రి గ్వాలియర్ లోనే బస చేస్తారు.

Day 3- Sunday: ఉదయమే గ్వాలియర్ ఫోర్ట్ ను వెళ్తారు. హోటల్ నుంచి 10 గంటలకు చెక్ అవుట్ అవుతారు. అనంతరం జై విలాస్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి ఓర్చాకు వెళ్తారు. ఓర్చా ఫోర్ట్ ను సందర్శించిన తర్వాత.. ఖజరహో కు బయల్దేరుతారు. రాత్రి ఖజరహోలోనే బస చేస్తారు.

Day 4- Monday: ఖజరహోలో స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం లైటింగ్ అండ్ సౌండ్ షోను చూస్తారు. రాత్రికి ఖజరహోలోనే బస చేస్తారు.

Day 5- Tuesday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత...రానేశ్ వాటర్ ఫాల్స్ చూస్తారు. సాయంత్రం సత్నాకు బయల్దేరుతారు. రైల్వే స్టేషన్ నుంచి 11.25 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.

Day 6- Wednesday: రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరల వివరాలు.....

hyd madhyapradesh tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 31,790 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,130 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,310గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

ధరల వివరాలు
ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point