Old government vehicles : ఏప్రిల్ 1 నుంచి పాత ప్రభుత్వ వాహనాలకు గుడ్ బై!
Old government vehicles scrappage : 15ఏళ్లు పైబడిన వాహనాలను వదిలించుకోవాలని గత కొంతకాలంగా కేంద్రం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి 9లక్షలకుపైగా పాత ప్రభుత్వ వాహనాలు రోడ్డు ఎక్కువని స్పష్టం చేశారు.
Old government vehicles : 15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలకు గుడ్ బై చెప్పేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 15ఏళ్ల పైబడిన ప్రభుత్వ ఆధారిత వాహనాలు.. 2023 ఏప్రిల్ 1 నుంచి రోడ్డు ఎక్కవని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
9లక్షల వాహనాలకు గుడ్బై..!
ఎఫ్ఐసీసీఐ ఏర్పాటు చేసిన ఈవెంట్లో సోమవారం పాల్గొన్నారు నతిన్ గడ్కరీ. ఈ క్రమంలోనే పాత వాహనాలను వదిలించుకునే విషయంపై కీలక వ్యాఖ్యాలు చేశారు.
Old government vehicles scrappage : "9లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలను వదిలించుకునేందుకు ఆమోదాలిచ్చాము. ఇవన్నీ 15ఏళ్లు పైబడిన వాహనాలే. కాలుష్యాన్ని వాపింపజేస్తున్న ఈ బస్సులు, కార్లను ఏప్రిల్ 1 తర్వాత రోడ్డు ఎక్కనివ్వము. ప్రత్యామ్నాయ ఇంధనంతో కూడిన వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తాము," అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తమ చర్యలతో కాలుష్యం మరింత తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర రోడ్డు రవాణా-హైవే మంత్రిత్వశాఖ నుంచి ఇటీవలే వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. 15ఏళ్లు పైబడి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వాహనాలతో పాటు రవాణా సంస్థల వద్ద ఉన్న బస్సులను ఏప్రిల్ 1 తర్వాత డీ-రిజిస్టర్ చేసి స్క్రాపింగ్కు పంపిస్తారు. డిఫెన్స్, అంతర్గత భద్రత కోసం వినియోగిస్తున్న స్పెషల్ పర్పస్ వెహికిల్స్ వెహికిల్స్కు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
Government scrappage policy : "మోటార్ వెహికిల్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ) 2021 రూల్కు తగ్గట్టుగా.. రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ కంద్రాలను ఏర్పాటు చేస్తాము. మొదటి రిజిస్ట్రేషన్ నుంచి 15ఏళ్లు వచ్చిన వాహనాలను అక్కడికి పంపిస్తాము," అని ఆ నోటిఫికేషన్ పేర్కొంది.
స్క్రాపేజ్ పాలసీ..
2021-22 బడ్జెట్లో భాగంగా ఈ స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టింది కేంద్రం. దీని ప్రకారం పర్సనల్ వెహికిల్స్ వయస్సు 20ఏళ్లు మించకూడదు. కమర్షియల్ వాహనాలకైతే అది 15ఏళ్లే. ఈ కొత్త పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పాత వాహనాలను వదిలించుకుని కొత్త వెహికిల్ తీసుకుంటున్న వారికి.. రోడ్ ట్యాక్స్లో 25శాతం వరకు రిబేట్ను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల పరధిలో ఉంటుందని పేర్కొంది.
Old government vehicles to be scrapped : దేశంలోని ప్రతి నగరానికి 150 కి.మీల దూరంలో కనీసం 1 ఆటోమొబైల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు.. నితిన్ గడ్కరీ గతేడాది చెప్పారు. యావత్ దక్షిణాసియా ప్రాంతానికే.. "వెహికల్ స్క్రాపింగ్ హబ్"గా మారే సామర్థ్యం భారత్కు ఉందని ఆయన అన్నారు.