Monkeypox cases in India : ఢిల్లీలో నైజీరియన్కు మంకీపాక్స్.. దేశంలో 6వ కేసు
Monkeypox cases in India : ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఫలితంగా దేశంలో ఇప్పటివరకు 6 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Monkeypox cases in India : దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా.. ఢిల్లీలో ఓ 35ఏళ్ల వ్యక్తికి మంకిపాక్స్ పాజిటివ్గా తేలింది. ఆయన నైజీరియన్ దేశస్థుడని సమాచారం. ఫలితంగా ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద దేశంలో ఇది 6వ మంకీపాక్స్ కేసు.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా.. మంకీపాక్స్ బారిన నైజీరియన్.. ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణించకపోడంతో ఆయనకు అసలు ఆ వ్యాధి ఎలా సోకింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. గత ఐదు రోజులుగా ఆయనకు జ్వరం ఉంది. శరీరంలో బొబ్బలు వచ్చాయి.
ఇటీవలే.. ఆయన రక్తనమూనాను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీకి తీసుకెళ్లారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో ఆయనకు మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది.
మరోవైపు.. మంకీపాక్స్ లక్షణాలతో ఇద్దరు ఆఫ్రికా దేశస్థులు ఇప్పటికే ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.
తొలి మరణం..
Monkeypox death in India : దేశంలో శనివారం తొలి మంకీపాక్స్ మరణం నమోదు కాగా.. సోమవారం దానిని అధికారులు గుర్తించారు. యూఏఈ నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. కేరళ త్రిస్సూర్లో చికిత్స పొందుతూ శనివారం మరణించినట్టు.. ఆదివారం వార్తలు వచ్చాయి. కాగా.. ఆ వార్తలు నిజమేనని, ఆ వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని.. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ సోమవారం ధ్రువీకరించారు.
"జులై 22న.. ఓ యువకుడు యూఏఈ నుంచి కేరళకు తిరిగొచ్చాడు. 26న అతనికి జ్వరం వచ్చింది. ఆ సమయంలో కుటుంబసభ్యులతోనే ఉన్నాడు. 27న ఆసుపత్రిలో చేర్పించారు. 28న.. ఆ యువకుడిని వెంటిలేటర్ మీద పెట్టారు. 30వ తేదీన ఆతను ప్రాణాలు కోల్పోయాడు. యూఏఈలో జులై 19న అతనికి మంకీపాక్స్ పరీక్ష నిర్వహించారు. ఆ రిపోర్టుల్లో అతనికి పాజిటివ్ వచ్చింది," అని వీనా జార్జ్ వెల్లడించారు.
సంబంధిత కథనం