Pakistan economic crisis : లీటరు పాల ధర రూ. 210- కేజీ చికెన్​ రూ. 780- పాకిస్థాన్​ దుస్థితి ఇది!-in pakistan milk s price is 210 per litre and chicken now costs over 780 people suffer ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Pakistan, Milk's Price Is 210 Per Litre And Chicken Now Costs Over 780 People Suffer

Pakistan economic crisis : లీటరు పాల ధర రూ. 210- కేజీ చికెన్​ రూ. 780- పాకిస్థాన్​ దుస్థితి ఇది!

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 08:40 AM IST

Pakistan economic crisis : ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్​ ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భగభగమంటున్నాయి. లీటరు పాల ధర రూ. 210కి చేరింది!

పాకిస్థాన్​లో తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం
పాకిస్థాన్​లో తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం (AP)

Pakistan economic crisis : ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాకిస్థాన్​ చేస్తున్న విశ్వప్రయత్నాలు విఫలమవుతున్న తరుణంలో.. ధరల భారంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడి పరిస్థితులు.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిణామాలను తలపిస్తున్నాయి. పాకిస్థాన్​లో తాజాగా.. లీటరు పాల ధర రూ. 190 నుంచి రూ. 210కి చేరింది. ఇక బ్రాయిలర్​ చికెన్​ కేజీకి రూ. 30-40 పెరిగి రూ. 480-500 పలుకుతోంది. ధరలను చూసి ప్రజలు ఆయోమయ స్థితిలో పడ్డారు.

ప్రజలపై భారం..

సాధారణంగా కేజీ చికెన్​ ధర కొన్ని రోజుల క్రితం వరకు రూ. 620- రూ. 650గా ఉండేది. కానీ ఇప్పుడు అది రూ. 700- రూ. 800కి చేరింది. బోన్​లెస్​ మీట్​ ధర కేజీకి రూ. 1000 దాటిపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్​లోని ప్రముఖ వార్తాసంస్థ డాన్​ ఓ నివేదికలో పేర్కొంది.

Pakistan crisis latest news : పాకిస్థాన్​లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిని తాకడం ఇందుకు కారణం. ముడిసరకు ధరలు భారీగా పెరిగిపోవడంతో.. ఆ భారాన్ని సంస్థలు ప్రజలపై వేయక తప్పడం లేదు. నిరుద్యోగంతో అలమటిస్తున్న ప్రజలు.. ధరల భారాన్ని మోయలేకపోతున్నారు.

"1000కిపైగా దుకాణదారులు.. ద్రవ్యోల్బణం రేటును లెక్కలోకి తీసుకుని పాల ధరలను పెంచేశాయి. ఈ దుకాణాలు హోల్​సేల్స్​, డైరీ ఫార్మర్లకు చెందినవి. మావి కాదు," అని కరాచీ మిల్క్​ రీటైలర్స్​ అసోసియేషన్​ మీడియా కోఆర్డినేటర్​ వహీద్​ గద్ది తెలిపారు.

ఇంధన ధరలకు రెక్కలు..

Pakistan inflation rate : ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్​లోని ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం అవి రికార్డు స్థాయికి చేరాయి. అక్కడ.. లీటరు డీజిల్​ ధర రూ. 262గా ఉందంటే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. లీటరు పెట్రోల్​ ధర రూ. 249.8గా ఉంది. కిరోసిన్​ ధర లీటరుకు రూ. 189.83కి చేరింది. ధరలు భగభగమంటుండంతో.. ఇంధనానికి డిమాండ్​ పడిపోతోంది. "గతంలో రోజుకు 15వేల లీటర్లు విక్రయించేవాళ్లము. కానీ ఇప్పుడు 13వేల లీటర్లను విక్రయిస్తాము. ముందు ముందు డిమాండ్​ ఇంకా పడిపోతుందేమో!" అని కరాచీలోని ఓ పెట్రోల్​ స్టేషన్​ ఓనర్​ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఆర్థిక సంక్షోభంతో ఇతర వ్యాపారాలు కూడా డీలా పడ్డాయి. కరాచీలోని రెస్టారెంట్​లు.. తమ వ్యాపారం 50శాతం మేర పడిపోయిందని చెబుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు అమాంత పెరిగిపోతుండటంతో.. ప్రజలు డబ్బును ఖర్చు చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

Pakistan petrol and diesel price today : ఒక్క పాకీస్థానీ రూపీ.. ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే రూ. 3.26తో సమానం. అక్కడి రూపాయి రోజురోజుకు బలహీన పడుతుండటంతో దిగుమతులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా దేశీయంగా ధరలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 5వ స్థానంలో ఉన్న పాక్​.. ఇప్పుడు అప్పులు కట్టలేక చతికిలపడింది. అనేక బ్యాంకులు దివాళాకు అతి దగ్గర్లో ఉన్నాయి.

ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు.. ఫలించడం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో అధికారుల్లోనూ ఆందోళన పెరిగిపోతోందని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం