Gold rates : మళ్లీ తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్​లో ఎంతంటే..-gold rates today news in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Rates : మళ్లీ తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్​లో ఎంతంటే..

Gold rates : మళ్లీ తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్​లో ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Sep 03, 2022 06:24 AM IST

Gold rates today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధర వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధర వివరాలు..

Gold rates today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 46,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,500గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 పడి, రూ. 4,64,000కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 50,620కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 1,100 దిగొచ్చి.. రూ. 5,06,200గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,550గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,220గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,430గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,650గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,620గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,450గాను.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,670గాను ఉంది. ఇక లక్నోలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,550గాను.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,780గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,400గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,620గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,230గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి.. 52,300కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 51,600గానే ఉండేది.

Silver rate today in Hyderabad కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 58,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 52,300.. బెంగళూరులో రూ. 58,000.. ముంబైలో రూ. 52,300.. చెన్నైలో రూ. 58,000గా ఉన్నాయి.

వెండి ధర పుణెలో రూ. 52,300గా ఉండగా.. అహ్మదాబాద్​, జైపూర్, లక్నో​లో సైతం ఇదే రేటు కొనసాగుతోంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు (శుక్రవారం) దిగొచ్చాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 300 తగ్గి.. రూ 21,260కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 21,560గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 21,260గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

IPL_Entry_Point

సంబంధిత కథనం