Delhi murder: శ్రద్ధ హత్య తరహాలోనే ఢిల్లీలో మరో దారుణం
Delhi Man Strangled Partner ఢిల్లీలోని నఫాజ్గఢ్ ప్రాంతంలో ఫ్రీజర్ లో దాచి ఉంచిన ఒక యువతి మృతదేహం సంచలనం సృష్టించింది. అఫ్తాబ్ లాగానే తన లివిన్ పార్ట్ నర్ ను హత్య చేసి ఫ్రీజర్ లో పెట్టాడు నిందితుడు.
Delhi Man Strangled Partner ఢిల్లీలోని నఫాజ్గఢ్ ప్రాంతంలో ఉన్న ఒక రోడ్ సైడ్ దాబాలో కుక్కి పెట్టిన ఒక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ దాబా యజమానిని అరెస్ట్ చేసిన విచారింగా, విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాల్కర్ ను హత్య చేసిన ఆఫ్తాబ్ తరహాలోనే ఇక్కడ కూడా లివిన్ పార్ట్ నర్ నిక్కి యాదవ్ ను సాహిల్ గెహ్లాత్ దారుణంగా చంపేశాడు.
ట్రెండింగ్ వార్తలు
Delhi Man Strangled Partner అసలేం జరిగింది?
24 ఏళ్ల సాహిల్ గెహ్లోత్ , 23 ఏళ్ల నిక్కీ యాదవ్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. లివిన్ పార్ట్ నర్స్ గా కొనసాగుతున్నారు. నిక్కీ యాదవ్ ది హరియాణా. మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష కు కోచింగ్ తీసుకోవడం కోసం ఢిల్లీ వచ్చింది. అదే శిక్షణ కేంద్రంలో సాహిల్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. సాహిల్ గహ్లోత్ కుటుంబానికి ఢిల్లీలోని నఫాజ్గఢ్ ప్రాంతంలో ఒక రోడ్ సైడ్ దాబా ఉంది.
Delhi Man Strangled Partner పెళ్లి కుదరడంతో..
వేరే అమ్మాయితో తనకు పెళ్లి కుదరడంతో నిక్కీ యాదవ్ ను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగేవి. తననే పెళ్లి చేసుకోవాలని నిక్కీ యాదవ్ సాహిల్ ను ఒత్తిడి చేయడం ప్రారంభించింది. సరిగ్గా సాహిల్ పెళ్లి రోజు.. నిక్కీ తన వివాహాన్ని అడ్డుకుంటుందేమోనన్న భయంతో.. ఆమెను బయటకు తీసుకువచ్చి, కారులోనే డేటా కేబుల్ ను గొంతుకు బిగించి హత్య చేశాడు సాహిల్. అనంతరం, మృతదేహాన్ని అదే కారులో తమ రోడ్ సైడ్ దాబాకు తీసుకువచ్చి, హోటల్ లోని ఫ్రీజర్ లో దాచి పెట్టాడు. ఆ తరువాత, తాపీగా వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఫ్రీజర్ లో మృతదేహం సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు పంపించారు. సాహిల్ గహ్లోత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేరంలో మరెవరైనా పాలు పంచుకున్నారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. హత్య జరిగిన కారును, మృతదేహాన్ని దాచి ఉంచిన ఫ్రీజర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిక్కీ యాదవ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తన కూతురును హతమార్చిన సాహిల్ కు మరణ శిక్ష విధించాలని నిక్కీ తండ్రి సునీల్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.
టాపిక్