Sudigaali Sudheer Re Entry: ఆ పాపులర్‌ షోలో సుధీర్ రీఎంట్రీ.. రష్మీ ఫుల్ హ్యాపీ..!-sudigaali sudheer re entry in sridevi drama company and he dance with rashmi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudigaali Sudheer Re Entry: ఆ పాపులర్‌ షోలో సుధీర్ రీఎంట్రీ.. రష్మీ ఫుల్ హ్యాపీ..!

Sudigaali Sudheer Re Entry: ఆ పాపులర్‌ షోలో సుధీర్ రీఎంట్రీ.. రష్మీ ఫుల్ హ్యాపీ..!

Maragani Govardhan HT Telugu
Nov 09, 2022 12:15 PM IST

Sudigali Sudheer Re Entry: సుడిగాలి సుధీర్ పాపులర్ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం జబర్దస్త్‌తో శ్రీదేవి డ్రామా కంపెనీ షోను వదిలేసి వెళ్లాడు సుధీర్. తాజాగా రీ ఎంట్రీ ఇవ్వడంతో తన తోటి నటీ, నటులు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు.

సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్

Sudigali Sudheer Re Entry: సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాంకర్ రష్మీ.. సుధీర్ జోడీ అభిమానులను ఎంతో అలరించింది. వీరిద్దరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే మరో షోలోనూ యాంకర్లు చేశారు. అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోనూ వదిలి వెళ్లిన సుధీర్.. వేరే ఛానల్‌లో యాంకర్‌గా చేయడమే కాకుండా.. సినిమాలతోనూ ఫుల్ బిజీ అవుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వచ్చాయి. సుధీర్ వెళ్లిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్‌గా రష్మీ ఒక్కరే చేసుకుంటూ వస్తున్నారు. దీంతో మళ్లీ వీరి జోడీని చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్న వేళ.. సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో రష్మీతో కలిసి సుధీర్ యాంకరింగ్ చేశాడు. అంతేకాకుండా ఆటో రాంప్రసాద్‌తో చేసిన స్కిట్లు సరదాగా ఆకట్టుకున్నాయి. మళ్లీ మునుపటి సుధీర్‌ను ట్రాక్‌లోకి వచ్చినట్లు తన అమయాకమైన ఎక్స్‌ప్రెషన్స్, పంచులతో ఆకట్టుకున్నాడు. ఈ షోకు ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుధీర్ రీఎంట్రీ ఇవ్వడంతో ఆమెతో పాటు తోటి నటీ, నటులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు.

తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో రష్మీతో కలిసి అందంగా డ్యాన్స్ చేయడమే కాకుండా ఇతర యాక్టర్లతో ఫుల్ సందడి చేశాడు సుధీర్. అంతేకాకుండా ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తకికరంగా సాగింది. రాం ప్రసాద్ కామెడీ హైలెట్ కాగా.. సుధీర్‌పై సెటైర్లు నవ్వులు పూయించాయి. మదర్స్-డాటర్స్ కాన్సెప్టుతో వచ్చిన స్కిట్ ఆకట్టుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో రీ ఎంట్రీ ఇచ్చినట్లు జబర్దస్త్‌లోనూ సుధీర్ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక బుల్లితెర యాంకర్ భానుశ్రీ తన పాటతో అలరించిది. గెలుపు తలుపులు అంటూ సాగే ఈ పాటతో ఇతరులను భావోద్వేగానికి గురిచేసింది. ప్రముఖ కమెడియన్ నూకరాజు కాంతార క్లైమాక్స్‌ను రీ క్రియేట్ చేశాడు. సినిమాలో రిషబ్ శెట్టి మాదిరిగా విచిత్రమై శబ్దంతో అరుస్తూ.. అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్