Dongalunnaru Jagratha OTT Release Date: రెండు వారాల్లోనే ఓటీటీలోకి కీరవాణి తనయుడి సినిమా
sri simha koduri dongalunnaru jagratha: కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. ఏ ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే..
Dongalunnaru Jagratha OTT Release Date: సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా పదిహేను రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పార్క్ చేసి ఉన్న కారులోని ఖరీదైన వస్తువుల్నిదొంగతనం చేయాలని ప్లాన్ చేసిన ఓ దొంగ కథతో ఈ సినిమా రూపొందింది . అనుకోని పరిస్థితుల్లో ఆ కారులోనే దొంగ చిక్కుకుపోతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలతో దర్శకుడు సతీష్ త్రిపుర....దొంగలున్నారు జాగ్రత్త సినిమాను తెరకెక్కించాడు.
ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. ఈ నెల 7 నుంచి నెట్ఫ్లిక్స్లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో దొంగలున్నారు జాగ్రత్త సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.
దొంగలున్నారు జాగ్రత్త సినిమాలో సముద్రఖని(Samuthirakani), ప్రీతి అస్రాణి ప్రధాన పాత్రలు పోషించారు. ఓటీటీ కోసమే ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. కాన్సెప్ట్ బాగున్నా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడటంతో థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.
మత్తవదలరా సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు శ్రీసింహ. దొంగలున్నారు జాగ్రత్త హీరోగా అతడి మూడో సినిమా