Shankar Movies Update: ఇండియన్-2, గేమ్ ఛేంజర్.. రెండింట్లో ఏది ముందు వస్తుంది? శంకర్ ఏమన్నారు?-shankar plans to release indian 2 movie first then game changer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shankar Plans To Release Indian 2 Movie First Then Game Changer

Shankar Movies Update: ఇండియన్-2, గేమ్ ఛేంజర్.. రెండింట్లో ఏది ముందు వస్తుంది? శంకర్ ఏమన్నారు?

Maragani Govardhan HT Telugu
Apr 01, 2023 07:48 PM IST

Shankar Movies Update: డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే రామ్ చరణ్‌తో చేస్తున్న గేమ్ ఛేంజర్‌కు ఆయన సుదీర్ఘ విరామం తీసుకోనున్నారు. ముందుగా కమల్‌తో చేస్తున్న ఇండియన్-2 పూర్తి చేసి ఆ తర్వాత చరణ్ సినిమాకు వస్తారట.

ఇండియన్2- గేమ్ ఛేంజర్
ఇండియన్2- గేమ్ ఛేంజర్

Shankar Movies Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ హాసన్‌తో ఇండియన్-2(Indian 2) చిత్రంతో పాటు తెలుగులో తొలిసారిగా రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే మరో సినిమా చేస్తున్నారు. ఓ పక్క ఇండియన్-2 సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరోపక్క గేమ్ ఛేంజర్‌(Game Changer)కు సంబంధించి ఓ పాటను చిత్రీకరించారు. అయితే ఈ రెండు సినిమాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై శంకర్ స్పందించారు.

రామ్ చరణ్‌తో తీస్తున్న సినిమాకు సుదీర్ఘ విరామం తీసుకోనున్నారట. ఇండియన్-2 సినిమాను పూర్తి చేసేంతవరకు గేమ్ ఛేంజర్‌ను పక్కన బెట్టారు. ఇండియన్-2 షూటింగ్‌ను జూన్ కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. అప్పటికల్లా కేవలం ఒకే ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందట. ఇండియన్-2ను జూన్‌లో షూట్ పూర్తి చేసి దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోనున్నారట.

మరోపక్క గేమ్ ఛేంజర్ సినిమాను అంతవరకు నిలిపివేయనున్నారట. ఇండియన్-2 కంప్లీట్ అయిన తర్వాత చరణ్‌తో మూవీని ప్లాన్ చేయనున్నారట. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని మాత్రం ఇంతవరకు చిత్రబృందం ప్రకటించలేదు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదలయ్యే అవకాశముంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో చరణ్ రెండు విభిన్న సినిమాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం