NTR centenary celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్.. ఎప్పుడో తెలుసా?-rajinikanth as chief guest for ntr centenary celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajinikanth As Chief Guest For Ntr Centenary Celebrations

NTR centenary celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్.. ఎప్పుడో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Apr 22, 2023 06:27 PM IST

NTR centenary celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రజినీకాంత్
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రజినీకాంత్

NTR centenary celebrations: తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 28న విజయవాడ వేదికగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే మంచి పాపులారిటీ ఉన్న రజినీకి అన్న రామారావు అంటే ఎనలేని అభిమానం.

ఎన్టీఆర్‌తో రజినీకి మంచి అనుబంధం ఉంది. సూపర్ స్టార్ నటించిన భాషా సినిమా తారకరాముడి చేతుల మీదుగానే లాంచ్ అయింది. ఆయనతో ఉన్న అనుబంధం కారణంగా నందమూరి కుటుంబం తారక రాముడి శత జయంతి ఉత్సవాలకు రజినీని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారట. విజయవాడం పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. రజినీ వస్తున్నాడనే వార్త తెలియడంతో నందమూరి-సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ ఈవెంట్‌లో రజినీకాంత్‌తో కలిసి వేదికను పంచుకోనున్నారు నందమూరి బాలకృష్ణ. వీరితో పాటు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే రజినీని, బాలయ్య పలు పబ్లిక్ ఫంక్షన్లలో కలిసి కనిపించారు. అంతేకాకుండా వీరి మధ్య మంచి సాంగత్యం ఉందనే విషయం సినిమా సమాజంలో అందరికీ తెలిసిందే.

ఇటీవల రజినీకాంత్.. చంద్రబాబుతో సమావేశమవడంతో నందమూరి, సూపర్ స్టార్ కుటుంబాల మధ్య బంధం మరింత బలపడిందని తెలుస్తోంది. వీరి కలయిక అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తారక రాముడికి సంబంధించిన ప్రత్యేక నాణెమును ఆవిష్కరించనున్నారట. ఇది ఈ కార్యక్రమంలోనే హైలెట్ కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28న విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ ఈ ఈవెంట్‌కు వేదిక కానున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point