Prabhas and Maruthi Movie Update: మారుతీతో ప్రభాస్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజు నుంచేనా?-prabhas and maruthi combo movie regular shoot will start on 2022 october 22 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas And Maruthi Combo Movie Regular Shoot Will Start On 2022 October 22

Prabhas and Maruthi Movie Update: మారుతీతో ప్రభాస్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజు నుంచేనా?

Maragani Govardhan HT Telugu
Oct 21, 2022 02:45 PM IST

Prabhas and Maruthi Movie Update: డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ మారుతీతో చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ శనివారం నుంచి ప్రారంభం కాబోతుంది.

ప్రభాస్
ప్రభాస్ (HT_PRINT)

Prabhas and Maruthi Movie Update: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మన డార్లింగ్.. ఆ సినిమాపై మిక్స్‌డ్ టాక్ రావడంతో తన ఆశలంతా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా.. సర్వత్ర మిశ్రమ స్పందనల వ్యక్తమయ్యాయి. దీంతో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్ విలక్షణ దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది.

ప్రభాస్ బర్త్ డే(అక్టోబరు 23) సందర్భంగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారట. అతడి పుట్టిన రోజుకు ఒక నాడు ముందే అంటే అక్టోబరు 22 నుంచి మారుతీ చిత్రం పట్టాలెక్కబోతుందని సమాచారం. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి చిన్నపాటి షెడ్యూల్‌ జరగనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ నెలకు ఏడు రోజుల కాల్షీట్లు కేటాయించనున్నారట. అలా సినిమా అయ్యే వరకు నెలకు ఏడు రోజులు మాత్రమే డార్లింగ్.. మారుతీ చిత్రంలో పాల్గొనబోతున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

మారుతీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ నటించిన సలార్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతుంది. ఓ పక్క వరుస సినిమాలతో డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ మారుతీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాను పట్టాలెక్కించారు. అందుకోసం మారుతీకి అవసరమైన సహాయ, సాకారాలను అందించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసింది. వీరు ఎవరన్నది త్వరలోనే స్పష్టత రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం